Tirumala Tirupati Devasthanam To Release Rs 300 Seeghra Darshanam Tickets For April Month Details

Tirumala Tirupati Devasthanam To Release Rs 300 Seeghra Darshanam Tickets For April Month Details

రెండు గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం... రూ.300 టికెట్స్ సింపుల్‌గా తీసుకోండిలా

శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనార్థం ప్రతి నిత్యం దేశ విదేశాల నుండి భక్తులు తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తుంటారు. తిరుమలకు చేరుకున్న భక్తులకు టీటీడీ విఐపి బ్రేక్, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, దాతలు, సర్వదర్శనం టైం స్లాట్, దివ్యదర్శనం వంటి వివిధ పద్ధతుల ద్వారా టిటిడి స్వామి వారి దర్శనం కల్పిస్తూ ఉంటుంది.

సామాన్య భక్తుల మొదలుకుని రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తల తిరుమలకు క్యూ కడుతూనే ఉంటారు. శ్రీనివాసుడి క్షణకాలం పాటు దివ్య మంగళ స్వరూపం కోసం పరితపించి పోతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తుంటారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రతి నెల ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టిటిడి అధికారిక వెబ్సైట్‌లో టిటిడి విడుదల చేస్తుంటుంది.

సామాన్యుల కొరకు టీటీడీ ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది టీటీడీ. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సులభంగా స్వామి వారి దర్శనం చేసుకోడమే టిటిడి ప్రధాన ధ్యేయం. ప్రతి నెల మాదిరిగానే సుదూర ప్రాంతాల భక్తులు, గ్రామీణ ప్రాంతాల భక్తుల సౌఖర్యార్ధం నేడు ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టిటిడి విడుదల చేయనుంది.

ఏప్రిల్ నెలలో తిరుమలకు రావాలన్నా భక్తులకు గమనిక. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను టిటిడి అధికారిక వెబ్ సైట్ లో విడుదల బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. జియో క్లౌడ్ సహాయంతో మరింత సులభతరంగా టీటీడీ వెబ్ సైట్ రూపుదిద్దుకుంది.

రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్సైట్ http://ttdevasthanams.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది. నకిలీ వెబ్ సైట్ లను ఆశ్రయించి మోస పోవద్దని టిటిడి భక్తులను విజ్ఞప్తి చేస్తుంది.

 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి