శివబాలాజీ – మధుమిత..సినిమాల్లో మాదిరిగానే ట్విస్టులు, గొడవలతో సాగిన వీరి ప్రేమాయణం చివరికి పెళ్లిపీటలకు చేరింది. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కపుల్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ జంట .. ఒకానొక సమయంలో విడిపోవాలని నిర్ణయించుకున్నారట..! అయితే వీరు ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఇరుకుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా శివబాలాజీ పేరెంట్స్ జాతకాలు కలవలేదని పెళ్లికి ఒప్పుకోలేదట.
అయితే ఇదే విషయాన్ని మధుమితకి శివబాలాజీ చెప్పగా ఈ రోజుల్లో ఈ జాతకాలు ఏంటి అని దాదాపు సంవత్సరం పాటు శివబాలాజీని దూరం పెట్టి మాట్లాడలేదట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న శివబాలాజీ ఓ రోజు నేరుగా తన ఫోన్ కి ఈ జీవితంలో నేను ఎప్పుడు విడిచిపెట్టను అని మెసేజ్ పెట్టారట. ఇక మెసేజ్ కి కరిగిపోయిన మధుమిత ఇద్దరూ కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లయ్యాక కూడా వీరిద్దరి మధ్య ఎన్నో గొడవలు వచ్చాయట.
ముఖ్యంగా మొదటి బాబు పుట్టిన సమయంలో చిన్నచిన్న గొడవల కారణంగా మధుమిత పుట్టింటికి వెళ్ళగా శివబాలాజీ తన కజిన్స్ దగ్గరికి వెళ్లారట. అయితే ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్న సమయంలో ఓసారి శివ బాలాజీ మధుమిత దూరంగా ఉన్నారనే విషయం తెలుసుకున్న శివ బాలాజీ కజిన్స్ నువ్వు మధుమిత ఇంటికి వెళ్లి ఆమెని తీసుకురమ్మని చెప్పడంతో మధుమితకు ఫోన్ చేసిన శివబాలాజీ నువ్వు మా ఇంటికి వచ్చి సారీ చెబుతానే వస్తాను అని తెగేసి చెప్పిందట మధుమిత.

దాంతో చేసేదేమీ లేక శివ బాలాజీ మధుమిత ఇంటికి వెళ్లారట.ఇంటికి వెళ్ళాక సారీ చెప్పకుండానే శివ బాలాజీ తో కలిసి వచ్చేసిందట మధు.అలా దాదాపు వీళ్ళిద్దరు విడాకుల వరకు వెళ్లి మళ్లీ కలిసారంటూ ఓ ఇంటర్వ్యూలో మధుమిత చెప్పుకొచ్చింది.