విజయ్ కుమార్ కూమార్తె వనిత విజయ్ కుమార్. చేసింది కొన్ని సినిమాలే అయిన అందరికీ సుపరిచితమే. కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్ , దివంగత మంజుల వారసురాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది వనితా విజయ్ కుమార్. చంద్రలేఖ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత 7 ఏళ్లలో మూడు సార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఇప్పటికీ ఒంటరి జీవితం గడుపుతుంది.
అటు తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది. వనితా విజయ్ కుమార్. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయిన తన నటనతో ఆకట్టుకుంది. కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్, దివంగత నటి మంజుల దంపతుల వారసురాలిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చంద్రలేఖ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వనీతా విజయ్ కుమార్.. ఆ తర్వాత దేవి సినిమాతో తెలుగులో మరింత పాపులర్ అయ్యింది. దేవి సినిమా తర్వాత తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మాణిక్కం, హిట్లర్ బ్రదర్స్ వంటి చిత్రాల్లో కనిపించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది.
ముందుగా నటుడు ఆకాష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆకాష్ తో విడాకులు తీసుకుంది వనితా. ఆ తర్వాత కొన్నాళ్లుగా ఒంటరిగా గడిపిన ఆమె వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి జయనిత అనే కుమార్తె జన్మించింది. కానీ ఆ బంధం సైతం ఎక్కువరోజులు సాగలేదు. చివరకు రెండో భర్తతో సైతం డివోర్స్ తీసుకుంది. రెండుసార్లు విడాకుల తర్వాత చాలా కాలం ఒంటరిగానే గడిపిన వనితా.. గతేడాది పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది.
కానీ వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొన్నాళ్లకు పీటర్ పాల్ అనారోగ్య కారణాలతో మరణించాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా.. ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఇటివలే కొరియోగ్రాఫర్ రాబర్ట్ రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే కేవలం తమ నెక్ట్స్ మూవీ ప్రమోషన్స్ కోసమే ఆ ప్రచారం జరిగిందని తెలిసింది.