30 ఏళ్ల రిచారియా.. తాజాగా ప్రయాగరాజ్లో తాను చేస్తున్న పనులకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు. ఆమె ఇటీవలి ఫొటోలను జాగ్రత్తగా గమనిస్తే.. ఆమె చాలా ఆలయాలు సందర్శించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. చాలా చోట్ల ఆమె ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. అయితే ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఓ మహిళా సాధ్వి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సాధ్వి దుస్తులతో కుంభమేళా వేదిక దగ్గర హల్చల్ చేస్తున్నారు హర్ష్ రిచారియా.. అంతేకాదు స్వామీజీలతో కలిసి రథంపై ఆమె ఊరేగారు.
అంతేకాకుండా కేవలం సాధువులకు మాత్రమే ప్రవేశం కల్పించే షాహీ స్నాన్లో హర్ష్ రిచారియాకు కూడా స్థానం కల్పించారు.. దీంతో కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్న హర్ష రిచారియా గురించి గూగుల్ కూడా వెతుకుతున్నారు నెటిజన్లు.. కుంభమేళాలో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే సాధ్వి హర్ష్ రిచారియా తీరుపై భగ్గుమన్నారు జ్యోతిష్య పీఠం శంకారాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. పవిత్ర కుంభమేళాలో అందానికి ప్రాధాన్యత లేదని , అధ్యాత్మికతకు మాత్రమే చోటు ఉంటుందని స్పష్టం చేశారు.
సాధువులతో కలిసి రథంపై ఊరేగడం.. షాహీస్నాన్లో పాల్గొనడం హిందూ ధర్మానికి విరుద్దమన్నారు. కుంభమేళాలో ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగదన్నారు శంకరాచార్య కొన్ని సార్లు తాను రెండేళ్ల క్రితం సన్యాసం స్వీకరించినట్టు చెప్పారు హర్ష్ రిచారియా.. అయితే కుంభమేళాలో ఆమెపై వివాదం చెలరేగడంతో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు.. కాషాయం దుస్తులు వేసుకున్నంత మాత్రాన సన్యాసిని కావాల్సిన అవసరం లేదన్నారు. తాను శాంతిని ఇష్టపడతానని, మంత్రాలు పఠించడం ద్వారా తనకు సాంత్వన లభిస్తుందని అన్నారు.
ఆమె బ్యాక్ గ్రౌండ్కు వెళ్తే హర్ష్ రిచారియా స్వస్థలం ఉత్తరాఖండ్… యాంకర్గా, మోడల్గా పనిచేశారు.. రెండేళ్ల క్రితం నుంచి ఆమె అధ్యాథ్మిక బాట పట్టినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. భోపాల్కు చెందిన నిరంజని అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ కైలాసానంద్ మహారాజ్కు శిష్యురాలిగా ఉన్నారు. దీంతో పాటు రిచారియా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మాత్రమే కాదు..ప్రొఫెషనల్ హోస్ట్ కూడా కావడంతో ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.