మోనాలిసా మాట్లాడుతూ, ఆమె మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ నగరం నుండి వచ్చానని తెలిపింది. గత 15 రోజులుగా ఇక్కడ ఉంటున్నానని అయితే తనకి తెలియకుండా ఎవరో రహస్యంగా వీడియో తీశారని, ఆ తర్వాత అది వైరల్గా మారిందని చెప్పింది. అయితే ‘కొందరు పురుషులు నా టెంట్లోకి వచ్చారు. తమతో ఫొటోలు దిగాలని వేధించారు. మా నాన్న పంపించారని అన్నారు. కానీ నేను కుదరదని చెప్పాను. మా నాన్న దగ్గరకే వెళ్లమని గట్టిగా చెప్పాను. కానీ వాళ్లతో ఫొటోలు దిగలేదు. నాకు చాలా భయమేసింది’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తరువాత తన తండ్రి వచ్చి తాను ఎవరినీ టెంట్ వద్దకు పంపించలేదని చెప్పినట్టు తెలిపింది.
‘‘ఆ తరువాత నా తండ్రి వాళ్లను నిలదీశాడు. అలా అనుమతి లేకుండా టెంట్లోకి ఎలా వెళతారని మండిపడ్డాడు. మరోవైపు, నా సోదరుడు కూడా తీవ్ర ఆగ్రహానికి గురై వాళ్ల సెల్ఫోన్లు తీసుకుని నా ఫొటోలు డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ల నా సోదరుడిపై దాడి చేశారు’’ అని వాపోయింది. తన ఉదంతం వైరల్ అయ్యాక అనేక మంది ఫొటోలు అంటూ వెంటపడుతున్నారని చెప్పింది.‘‘ఆమెకు ప్రయాగ్రాజ్లో ఉండటం ఇబ్బందిగా మారింది. తన పని తాను చేసుకోలేకపోతోంది. అందరూ ఆమెనే ఫాలో అవుతున్నారు.
కెమెరాలతో ఆమెను సమీపిస్తూ మాట కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. తను పూలు కూడా అమ్ముకోలేకపోతోంది’’ అని యువతి తాత మీడియాకు తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 16 ఏళ్ల మోనీ భోన్సలే పూల దండలు అమ్మేందుకు ప్రయాగ్రాజ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె సహజ సౌందర్యానికి ముగ్ధుడైన ఓ వ్యక్తి ఆమె ఫొటోలు తీసి నెట్టిట పెట్టడంతో ఆమె ఒక్కసారిగా కుంభమేళా మోనాలిసాగా పాప్యులర్ అయిపోయింది. ఇదే క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్మేకర్ సనోజ్ మిశ్రా దృష్టిలో కూడా ఆమె పడింది.
ఆయన తన తదుపరి చిత్రంలో ఈ మోనాలిసాకు ప్రధాన పాత్ర ఆఫర్ చేయబోతున్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఆ తరువాత నుంచి నిత్యం జనాలు ఆమె ఫొటోలు తీసేందుకు మాట కలిపేందుకు, ఇంటర్వ్యూ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఆమె రోజువారి పనులకు ఆటంకంగా మారుతున్నారు. ఇదే విషయాన్ని ఆమె తాజాగా మీడియాతో పంచుకుంది.