సామాన్య భక్తురాలిలా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..?

divyaamedia@gmail.com
1 Min Read

రాజకీయ నేతలతో పాటుగా సినీ ప్రముఖులు వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఓ హీరోయిన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తిరుమలకు వస్తే ఆ హంగామా వేరేగా ఉంటుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ది మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే ఈ బ్యూటీ పేరే వినిపిస్తుంది. గతేడాది ఆమె నటించిన అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి.

ఈ సంక్రాంతికి మరో సినిమాతో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తన సినిమా రిలీజ్ కు ముందు ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ బ్యూటీ మరెవరో కాదు మీనాక్షి చౌదరి. ఈ సంక్రాంతికి తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *