ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మతో అతడు విడాకులకు సిద్ధమవుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు చాహల్, ఇటు ధనశ్రీ ఒకర్నొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. వీళ్లు డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని.. త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారని క్రికెట్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే ధనశ్రీ వర్మ నుంచి విడాకుల వార్తల మధ్య యుజ్వేంద్ర చాహల్ ఒక మిస్టరీ గర్ల్తో కనిపించాడు.
ముంబైలోని జుహులో చాహల్ మిస్టరీ గర్ల్తో కనిపించాడు. చాహల్ ఓ అమ్మాయితో కలిసి కారులో కనిపించాడు. మీడియా కెమెరాలు అతడిని బంధించేందుకు ప్రయత్నించగా.. ఈ భారత క్రికెటర్ ముఖం దాచుకున్నాడు. అప్పటి నుంచి ధనశ్రీ, చాహల్ల విడాకుల వార్తలకు ఈ మిస్టరీ గర్ల్ కారణమా అనే చర్చలు జరుగుతున్నాయి. 2023 సంవత్సరంలో ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ నుంచి చాహల్ అనే ఇంటిపేరును తొలగించింది. ఈ క్రమంలో ఓ స్టోరీని కూడా పంచుకుంది.
కొత్త జీవితం రాబోతోంది అంటూ రాసుకొచ్చింది. అప్పుడు కూడా వారి బంధానికి సంబంధించి రకరకాల చర్చలు జరిగాయి. అయితే, ఈ విషయం త్వరలోనే సద్దుమణిగింది. అయితే ఇప్పుడు ఇద్దరి దారులు వేరయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, ఇద్దరూ విడాకులు తీసుకోవడం ఖాయమని తేలింది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల మొదటి సమావేశం లాక్ డౌన్ సమయంలో జరిగింది.
డ్యాన్స్ నేర్చుకునేందుకు చాహల్ తనను సంప్రదించినట్లు ధనశ్రీ ఓ రియాల్టీ షోలో చెప్పింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది. చాహల్, ధనశ్రీ డిసెంబర్ 2020 లో చాలా వైభవంగా వివాహం చేసుకున్నారు.