ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసిన ఐటీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలు భారీ బడ్జెట్తో నిర్మించడం, వాటికి వస్తున్న రిటర్న్లు కూడా భారీగా ఉండటంతో వీరు చెల్లించిన ఆదాయపు పన్నుకు, వీరికి వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అలాగే దిల్రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏకకాలంలో అనేకచోట్ల సోదాలు చేస్తున్న 65 బృందాలు, ఎనిమిది ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్రాజు ప్రొడక్షన్స్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్తో నిర్మించారు దిల్రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా దిల్రాజు వ్యవహరించారు. మరో వైపు మైత్రీ సంస్థ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి.
మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మైత్రీ సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ. 18వందల కోట్లకు పైగా వసూల్ చేసినట్టు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు. ఈ క్రమంలో సంక్రాంతి సమయంలో పుష్ప 2 రీ లోడెడ్ పేరుతో మరికొంత భాగాన్ని యాడ్ చేసిన విషయం తెలిసిందే.
గతంలోనూ మైత్రి మేకర్స్ పై పలుసార్లు ఐటీ దాడు జరిగాయి. ప్రస్తుతం మైత్రి మూవీస్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాలను నిర్మిస్తుంది. అలాగే మ్యాంగో మీడియా సంస్థల పై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సింగర్ సునీత భర్త కు సంబందించిన ఆఫీసులు, ఇళ్ల పై కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు.