ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో తప్పనిసరిగా నవంబర్ 14న న్యాయస్థానానికి హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.అదేరోజు కోర్టుకు వచ్చి పర్సనల్ బాండ్ సమర్పించాలని నాంపల్లి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ కేసు నేడు విచారణకు రాగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నవంబర్ 14న జరగబోయే తదుపరి విచారణకు దగ్గుబాటి వెంకటేశ్తో పాటు, రానా, అభిరామ్, సురేశ్ బాబు తప్పనిసరిగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది.

వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడానికి కచ్చితంగా నలుగురూ కోర్టుకు రావాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేశారన్న ఆరోపణల నేపథ్యంలో సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, అభిరామ్తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేశ్లపై గతంలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ కేసు విచారణలో భాగంగానే దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టుకు రావాలంటూ సమన్లు పంపింది.
