వాహనం ఢీకొని చిరుతకు తీవ్రగాయాలు..! మృత్యువుతో పోరాడుతూనే ఏం చేసిందో చుడండి.

divyaamedia@gmail.com
1 Min Read

నర్సరీ సమీపంలో గురువారం సాయంత్రం చిరుతపులిని వాహనం ఢీ కొట్టింది. దీంతో చిరుతపులికి తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిసేపు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పోరాడిన చిరుత.. చివరకు విగతజీవిగా మారింది. జాతీయ రహదారి 44 దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొని ఆడ చిరుత మృతి చెందింది. అయితే గాయపడ్డ పులి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. తీవ్రంగా గాయపడి ఎక్కువగా నడవలేని పరిస్థితిల్లో ఉన్నప్పటికీ..

తనకు దగ్గరకు వచ్చే వారిపై పంజా విసిరేందుకు ఏ మాత్రం వెనకాడలేదు ఆ చిరుత. అలా ఎంతోసేపు తీవ్రమైన నొప్పిని భరిస్తూ రోడ్డుపైనే విల్లవిల్లాడిపోయింది. అలా తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడి చనిపోయింది.. మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని వల్లూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.. మగ చిరుత పులికి సుమారు రెండు సంవత్సరాల పైబడి వయస్సు ఉంటుంది. గురువారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతం నుంచి 44వ జాతీయ రహదారిపైకి వస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనం దాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో చిరుత తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలోనే రహదారి వెంట వస్తున్న వాహనాలపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. కొద్దిసేపు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పోరాడిన చిరుత.. చివరకు విగతజీవిగా మారింది. పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు.. వల్లూరు అడవి ప్రాంతంలోనే మృతి చెందిన చిరుత పులికి పోస్టుమార్టం చేయించి పూడ్చి పెట్టనున్నట్టు తెలిపారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *