ఆయన వల్ల స్టేజిపైనే గుక్కపెట్టి ఏడ్చిన బ్రహ్మానందం..అసలేం జరిగిందంటే..?

divyaamedia@gmail.com
1 Min Read

బ్రహ్మానందం తెరపై కనిపిస్తే మాత్రం నాన్‌స్టాప్‌గా న‌వ్వుకుంటూనే ఉంటాం. అంతలా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన బ్ర‌హ్మానందం ఏకంగా 1200కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇటీవ‌ల ఆయ‌న మీ అండ్ మై పేరుతో తన ఆత్మకథ రాసుకున్నారు. అయితే తెలుగు లెక్చరర్‌ అయిన బ్రహ్మానందం హాస్యం, యాక్టింగ్ పట్ల ఆసక్తి ఉండడంతో సినీరంగంవైపు అడుగులు వేశారు.

కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత లెజెండ్రీ కమెడియన్ గా మారారు. ఎంతో మందికి బ్రహ్మానందం గురువు. ఇండస్ట్రీలోనే కాదు.. సోషల్ మీడియాలో మీమర్స్ కు కూడా బ్రహ్మానందం గురువు అయ్యారు. నెటిజన్స్ బ్రహ్మానందంగారిని మీమ్ గాడ్ అని పిలుస్తూ ఉంటారు. ఇటీవల బ్రహ్మానందం సినిమాల స్పీడ్ తగ్గించారు. అడపదడపా సినిమాలు చేస్తున్నారు బ్రహ్మానందం.

అలాగే పలు టీవీ షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆహాలో లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు హాజరయ్యారు బ్రహ్మానందం..ఈ ఎపిసోడ్ లో బ్రహ్మానందం తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. కాగా ఈ ప్రోమో చివరిలో బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టుకోవడం చూడొచ్చు.. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి హోస్ట్ అడగ్గా.. ఆయనతో ఎంతో పెద్ద అనుబంధం ఉంది.

కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న మనిషి, మంచి మనిషి బాలసుబ్రహ్మణ్యం అంటూ చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *