స్టాక్మార్కెట్ల జోరుతో దిగివవస్తోంది బంగారం ధర. ఆల్టైమ్ హై నుంచి దాదాపు 7వేల రూపాయల మేర పసిడి ధర తగ్గింది. ఏప్రిల్ 22న లక్ష మార్కు దాటేసిన బంగారం ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో ఒకటి రెండు సార్లు మాత్రమే పసిడి ధర స్వలంగా పెరిగింది.
ఓవరాల్గా ఈ నెల రోజుల్లోనే 7 వేల రూపాయల రేటు తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే వారం రోజులుగా తగ్గుతూ పెరుగతూ వస్తున్న పసిడి నేడు మరోసారి దిగొచ్చింది. ఇప్పటికే ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలను చూసి సామాన్యులు కొనలేని పరిస్థితికి చేరుకున్నారు. బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడిపోతున్నారు.

24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర నిన్న రూ.95,510గా ఉండగా.. నేడు రూ.450 తగ్గి, రూ.95,020కు పడిపోయింది. గ్రాము బంగారం ధర రూ.9,502 పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర నిన్న రూ.87,550గా ఉండగా.. నేడు రూ. 450 తగ్గి, రూ.87,100 వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము బంగారం ధర రూ.8710 పలుకుతుంది.
మరోవైపు 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.71,630 ఉండగా.. నేడు రూ.360 తగ్గి రూ.71,270 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర దేశీయంగా రూ.100 పెరిగి రూ.98,100 వద్ద కొనసాగుతుండగా.. హైదరాబాద్లో వెండి ధర రూ.1,09,100 పలుకుతుంది.