నడిరోడ్డుపై మహిళా డీఎస్పీ ని జుట్టు పట్టిలాగి కొట్టిన నిరసనకారులు, వైరల్ అవుతున్న వీడియో.

divyaamedia@gmail.com
1 Min Read

తమిళనాడులోని విరుదునగర్ జిల్లా రామనాథపురానికి చెందిన 35 ఏళ్ల ట్రక్‌ డ్రైవర్‌ కాళికుమార్‌ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి హత్య చేశారు. దీనిపై తిరుచ్చూరి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మంగళవారం ఉదయం నిందితులను అరెస్టు చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహం ఉంచిన ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో అరుప్పుకోట్టై మార్గంలో బైఠాయించి ఆందోళనకు దిగారు. నిరసనకారులు అరుప్పుకోట్టై ప్రాంతంలోని రహదారిని దిగ్భందించేందుకు యత్నించగా.. డీఎస్పీ గాయత్రి, ఇతర పోలీసులు వారిని అడ్డుకున్నారు.

వారిని చెదరగొట్టేందుకు డీఎస్పీ గాయత్రితోపాటు పలువురు పోలీసులు అడ్డుగా వెళ్లగా.. నిరసనకారుల్లో కొందరు ఆమెపై దాడి చేశారు. డీఎస్పీ జుట్టు పట్టుకుని లాగి కొట్టడంతో మిగిలిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను అక్కడి నుంచి తరలించారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసేందుకు యత్నించగా.. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య భౌతిక వాగ్వాదం చోటు చేసుకుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *