తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు తర్వాత ఆ స్థాయి ఫ్యామిలీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో వెంకటేష్ మాత్రమే. కుటుంబ ప్రేక్షకుల్లో వెంకీకి ఉన్న ఇమేజ్ మామూలుగా ఉండదు. ఆయన ఏడిస్తే ఆడవాళ్లు కూడా ఏడవాల్సిందే.. మరో ఆప్షన్ లేదు. ఇప్పటికే 80 సినిమాలకు పైగా నటించిన ఈయన.. సూపర్ సక్సెస్ రేట్తో దూసుకుపోతున్నాడు. మధ్యలో రానా నాయుడుతో డిఫరెంట్గా ప్రయత్నించాడు. అయితే నిజానికి హీరో కాకపోయి ఉంటే వెంకటేష్ ని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు.
ఉద్యోగంలో ఏ స్థాయిలో ఉన్నా, బిజినెస్ మ్యాన్గా ఓ పొజిషన్లో ఉనన్నా, సినిమా తెచ్చె గుర్తింపు, అభిమానం, ఫాలోయింగ్ మరే దాంట్లోనూ రాదు. ఒక్క రాజకీయాల్లో తప్ప. ఇప్పుడు టాలీవుడ్లో అగ్ర హీరోల్లో ఒకరిగా, లక్షలాది మంది అభిమానులు ఆరాధించే హీరోగా రాణిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలో రామానాయుడు స్టూడియోకి, బ్యానర్కి ఆయన ఓ ఫోకస్ పాయింట్గా, బ్రాండ్ అంబాసిడర్గా నిలిచాడు వెంకటేష్. అనేక సినిమాలు తమ బ్యానర్లోనే చేసి విజయాలుఅందుకున్నాడు. టాలీవుడ్లో తిరుగులేని స్టార్గా ఎదిగారు.
అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా నిలిచారు. ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసినా తెలుగులో విశేష ఆదరణ పొందాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేశాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి పోటీని తట్టుకుని నిలబడ్డాడు. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు వెంకీ. తాజాగా ఆయన ఆస్తుల లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ అంత పెద్ద కోటీశ్వరుడా అని ఆశ్చర్యపోయే డిటెయిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్లోనే అత్యంత కోటీశ్వరుడు అంటూ ప్రచారం నడుస్తుంది.
వెంకటేష్కి 2200కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆయన టాలీవుడ్లోనే రెండో అతిపెద్ద సంపన్నుడు అంటున్నారు. నాగార్జునకి ఎక్కువగా ఉన్నాయని, ఆయన తర్వాత వెంకీనే నిలుస్తారని అంటున్నారు. హైదరాబాద్లో వెంకీకి లగ్జరీ హోమ్ ఉంది. అది కోట్ల విలువ చేస్తుంది. దీంతోపాటు రామానాయుడు స్టూడియో ఉంది. ప్రొడక్షన్ ఉంది. హైదరాబాద్ లో రెండు స్టూడియోలు, వైజాగ్లో ఓ స్టూడియో ఉంది. వీటితోపాటు లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. వీటితోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారట. నాన్న రామానాయుడు నుంచి ఇది కొనసాగుతుందని, వందల ఎకరాల భూములు కొన్నట్టు తెలుస్తుంది.
మద్రాసులోనూ ల్యాండ్లు ఉన్నాయట, అలాగే హైదరాబాద్లోనూ ల్యాండ్స్ ఉన్నాయని చెబుతున్నారు. అన్న సురేష్ బాబుతో కలిసే పెట్టుబడులు పెట్టారని అంటున్నారు. కలిసే మెయింటేన్ చేస్తున్నారట. అలా అయితే ఉన్న ఆస్తుల్లో ఎవరికి వాళ్లు పంచుకున్నా రెండు వేల కోట్లకుపైగా ఉంటాయని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇది కేవలం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మాత్రమే.
