వరుణ్ సందేశ్ ఒక తెలుగు నటుడు. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ అయినప్పటికి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన 2019లో బిగ్బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అయితే ప్రస్తుతం చాలామంది భక్తులు అయ్యప్ప దీక్ష స్వీకరించి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తున్నారు.
నిత్యం అయ్యప్ప స్వామి సేవలో పునీతులవుతున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా అయ్యప్ప దీక్షను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు శబరిమల యాత్రకు కూడా వెళ్లారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నితిన్, రామ్ పొతినేని, వరుణ్ తేజ్, శర్వానంద్, ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని తదితరులు అయ్యప్ప మాలను ధరించారు.

ఇక టాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ సందేశ్ కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు. తన దీక్షకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం తన నివాసంలో అయ్యప్ప స్వామి పడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు వరుణ్ సందేశ్.

ఈ పూజా కార్యక్రమంలో అతని భార్య వితిక షేరు తో పాటు వందలాది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. తాజాగా ఇరుముడితో శబరిమల అయ్యప్ప దర్శనానికి బయలు దేరాడు వరుణ్ సందేశ్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.
