అనాథ పిల్లల కోసం హిరోయిన్ వరలక్ష్మి తన భర్తతో కలిసి ఏం చేసిందో చూశారా..?

divyaamedia@gmail.com
1 Min Read

వరలక్ష్మి.. 2003లో శంకర్ రూపొందించిన బాయ్స్ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది కానీ తండ్రి కోరిక మేరకు ఆ అవకాశం వదులుకుంది. అలాగే 2004లో వచ్చిన కాదల్, 2008లో వచ్చిన సరోజ చిత్రాల్లో కూడా అవకాశం కోల్పోయింది. అయితే గతేడాది హనుమాన్ తో సహా ఏకంగా ఆరు సినిమాల్లో నటించిన వరలక్ష్మి.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కేవలం రెండు సినిమాల్లో నే కనిపించింది.

ఈ ఏడాది ప్రారంభంలో విశాల్ తో కలిసి మదగజరాజ మూవీలో నటించిన వరలక్ష్మి కొన్ని నెలల క్రితమే శివంగి సినిమాతో మన ముందుకు వచ్చింది. ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్న వరలక్ష్మి ప్రస్తుతం తన భర్తతో కలిసి మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే వరలక్ష్మికి సామాజిక స్పృహ ఎక్కువ.

గతంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకుందీ అందాల తార. హెల్పింగ్ హ్యాండ్స్‌ హ్యుమానిటి స్వచ్ఛంద సంస్థ పిల్లలకు తనవంతుగా సాయం అందించింది వరలక్ష్మి. తన భర్త నికోలయ్‌ సచ్ దేవ్ తో కలిసి అనాథ పిల్లలకు ఇష్టమైన చెప్పులు, షూస్‌ను అందించింది. అలాగే వారితో సరదాగా గడిపి పిల్లలకు మర్చిపోలేని జ్ఞాపకాలను అందించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది వరలక్ష్మి. ఆరు నెలల క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియోను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు వరలక్ష్మి నికోలయ్ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *