భారత ఐటీ ఉద్యోగులకు భారీ షాక్.. H1B వీసాలపై ట్రంప్‌ సంచలన నిర్ణయం, లక్ష డాలర్లు చెల్లించాల్సిందే..!

divyaamedia@gmail.com
2 Min Read

డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హైలీ స్కిల్డ్‌ అయితేనే అమెరికాలో చోటు అన్నట్టుగా పాలసీ మార్చి ఇప్పుడు మన టెక్కీలపై దెబ్బకొట్టారు ట్రంప్.

భారత్‌తోపాటు చైనాపై ఇప్పుడు ఈ వీసాల ప్రభావం దారుణంగా ఉండబోతోంది. అమెరికన్లను నియమించుకోండి.. అమెరికా ఫస్ట్‌ అంటూ ఒకటికి పదిసార్లు చెప్తున్న ట్రంప్‌.. H1B ఫీజు లక్ష డాలర్లకు పెంచడం ద్వారా తన ఉద్దేశం ఏంటో క్లియర్‌గానే బయటపెట్టేశారు. ప్రస్తుతం H1Bకి లాటరీ విధానం అమల్లో ఉంది. ముందు వీసా కావాలనుకున్నవాళ్లు కొంత ఫీజ్‌ కడతారు. లాటరీలో పేరు ఫైనల్‌ అయితే.. అంటే లాటరీ తగిలితే డబ్బులు కట్టేవారు.

ఇప్పుడిది తీసేశారు. గతంలో కంపెనీలు H1B లాటరీలో ఎంపికైన వాళ్ల ఫీజులు కట్టి.. ఆన్‌సైట్‌ ఆఫర్‌ ఇచ్చేవి. ఇప్పుడు లక్ష డాలర్లంటే IT ప్రొఫెషనల్స్‌ని US పంపే విషయంలో కంపెనీలు ఒకటికి 100 సార్లు ఆలోచిస్తాయి..! ఇక్కడ ఇంకో విషయం. US ఏటా 85వేల వీసాలు ఇలా లాటరీ ద్వారా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడిది పోయి లక్ష డాలర్ల రేటు ఫిక్స్‌ అయ్యింది. అమెరికన్లతో సాధ్యం కాని వర్క్‌ చేయించుకోవడానికి, అక్కడి కంపెనీలు హైలీ స్కిల్డ్‌ వాళ్లను తీసుకునేందుకే ఈ H1B విధానం ఉన్నది అంటూ చెప్తున్నారు US కామర్స్‌ సెక్రటరీ హోవార్డ్‌ లూట్నిక్‌.

భారత్‌ అంటే మామూలుగానే విషం కక్కే టైప్‌లో మాట్లాడే లూట్నిక్‌.. విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకుని అమెరికన్ల అవకాశాలు పోగొట్టకండి అంటూ కంపెనీలకూ హితవు పలుకుతున్నారు. మీడియా సమావేశంలో ట్రంప్‌ కంటే ఆయనే ఎక్కువగా మాట్లాడారు. ఎందుకింత కఠినతరం చేసిందీ చెప్పుకొచ్చారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *