ఒకప్పుడు రైళ్లల్లో పాటలు పాడిన కుర్రాడు, కట్ చేస్తే ఇండస్ట్రీలో రూ. 1200 కోట్లతో స్టార్ గా..!

divyaamedia@gmail.com
1 Min Read

ఆయుష్మాన్ ఖురానా పంజాబ్ కు చెందినవాడు. ఆయనకు అపరశక్తి ఖురానా ఉన్నాడు. చండిగఢ్ లోని సెయింట్ జోన్స్ హై స్కూలులోనూ, డిఎవి కళాశాలలోనూ ఆయన చదువుకున్నాడు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందాడు. డిఎవి కళాశాలలో చదువుకునేటప్పుడు ఆఘజ్, మంచ్ తంత్ర అనే రెండు నాటక సంఘాలను స్థాపించారు.

అయితే హిందీ సినిమా ప్రపంచంలో సాధారణ కుర్రాడు రాణించడం చాలా కష్టం. అలాంటింది ఓ అబ్బాయి మాత్రం ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశాడు. ప్రస్తుతం అతడు బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. కరణ్ జోహార్ తిరస్కరించిన తర్వాత కూడా, అతను అనేక రూ. 100 కోట్ల హిట్‌లను అందించాడు. ఇప్పుడు మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అతడు మరెవరో కాదు.. ఆయుష్మాన్ ఖురానా. చండీగఢ్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయుష్మాన్ ఖురానా కేవలం విక్కీ డోనార్, ఆర్టికల్ 15, దమ్ లగా కే హైషా, బదాయి హో, అంధాధున్ వంటి చిత్రాల కనిపించారు. నటుడిగానే కాదు.. ఫేమస్ సింగర్ కూడా. పానీ ద రంగ్, సద్ది గాలి, నైనా ద క్యా కసూర్ వంటి పలు చార్ట్‌బస్టర్ పాటలను పాడారు.

2017లో మేరీ ప్యారీ బిందును ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఆయుష్మాన్ తన స్నేహితులతో కలిసి రైళ్లలో ఎలా పాటలు పాడేవాడో, తన కళాశాల ప్రయాణాలకు ఎలా నిధులు సమకూర్చుకునేవాడో గుర్తుచేసుకున్నారు. 2018లో కాఫీ విత్ కరణ్ సీజన్ 6లో విక్కీ కౌశల్ తో కలిసి ఆయుష్మాన్ ఖురానా కనిపించినప్పుడు, కరణ్ జోహార్ ఒకసారి తనను తిరస్కరించాడని అన్నారు.

ఆయుష్మాన్ ఖురానా రెండు సంవత్సరాల తర్వాత బాలీవుడ్‌లో తిరిగి అడుగుపెట్టబోతున్నాడు. ఇది మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో తదుపరి భాగం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *