ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య..! కొన్ని గంటల ముందే ఏం చేసిందో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పని చేస్తున్న యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవర్మణానానికి పాల్పడ్డారు. అయితే గత 18 ఏళ్లు తెలుగు మీడియాలో న్యూస్‌ యాంకర్‌గా, జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం టీ న్యూస్ ఛానెల్ లో టీవీ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. జవహర్ నగర్ లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛ గతంలో టీవీ9లో కూడా పనిచేశారు.

అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. వాటికి బుద్ధుడి కోట్‌ను యాడ్‌ చేశారు. “మనసు నిశ్శద్ధంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది” అని రాసుకొచ్చారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *