డ్రగ్స్ తీసుకోవడం తప్పని తనకు తెలుసని.. తప్పు చేశానని శ్రీరామ్ కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని.. తనను చూసుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. అయితే నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఎంతో సైలెంట్గా ఉండే ఈ హీరో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడమేంటని అభిమానులు కూడా ఆశ్చర్యపరుస్తున్నారు.
శ్రీరామ్ని రీసెంట్గా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, ఆయన నుండి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను చేసిన తప్పును ఒప్పుకుంటూనే అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కోర్టుకు వివరించారు.తనకి డ్రగ్స్ అవాటు చేసింది AIADMK మాజీ లీడర్ ప్రసాద్ అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్. గతంలో తాను ప్రసాద్ నిర్మాణంలో తీంగరై అనే చిత్రం చేశాను. ఆ సినిమాకి గాను రూ.10 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వాలి. అయితే డబ్బు అడిగిన ప్రతిసారి కూడా నాకు కొకైన్ ఇచ్చాడు.

గత శనివారం రాత్రి నుంగంబాక్కంలోని అతని ఇంట్లో కొకైన్ పార్టీని నిర్వహించగా, ఆ సమయంలో మాత్రమే నేను దాని వాడాను. నేను ఏరోజు డ్రగ్స్ అమ్మడం చేయలేదు. కొన్నాను అంతే అని శ్రీరామ్ చెప్పుకొచ్చారు. ఇక డ్రగ్స్ తీసుకోవడం తప్పని తనకు తెలుసని.. తప్పు చేశానని శ్రీరామ్ కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని, ఆయన బాగోగులు చూసుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం తిరస్కరించింది.
నార్కోటిక్స్ కేసులు విచారించే స్పెషల్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని న్యాయమూర్తి శ్రీరామ్కు సూచించారు. ఇక శ్రీరామ్కి జులై 7 వరకూ రిమాండ్ విధించారు.ఇక ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో అనే దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కేసులో మరో కోలీవుడ్ స్టార్ కృష్ణ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఆయన్ను విచారించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఆయన కేరళలో షూటింగ్లో ఉన్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లగా, కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.అతనికి కోలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అలాగే.. టాలీవుడ్ యాక్టర్స్తోనూ మంచి రిలేషన్ ఉందని అంటున్నారు. ఆయనని అరెస్ట్ చేసి విచారిస్తే మరింత మంది బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.