అందంపై అందరికీ స్పృహ పెరిగింది. ఒక్క వెంట్రుక రాలినా, అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు కనిపించినా ప్రాణం పోయినంత పని అవుతుంది జనానికి. ఆహారంతో పాటు వ్యాయామం, యోగాలతో తమ అందాన్ని కాపాడుకుంటున్నారు. అవసరమైతే కాస్మోటిక్ సర్జరీల వరకు వెళ్తున్నారు. అయితే కొంతమంది పెదవులు, మరికొంతమంది నడుము ఇలా బాడీలో కొన్ని పార్ట్స్ కు సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బాడీలోని చాలా పార్ట్స్ కు సర్జరీలు చేయించుకున్నారు.
అందం కోసం ఎన్నో రకరాల ప్రయోగాలు చేశారు. కొంతమంది సర్జరీ వికటించి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక హీరోయిన్ అయితే ఏకంగా 29 సర్జరీలు చేయించుకుంది. ఆమె ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ ఆమె.. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఊహించని విధంగా చనిపోయింది. ఇంతకూ ఆమె ఎవరంటే..ఆమె మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులను ఉండరు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు.

శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అతను ఫిబ్రవరి 24, 2018 న మరణించారు. శ్రీదేవి దుబాయ్లోని ఓ హోటల్లోని బాత్టబ్లో మునిగి మృతి చెందారు. శ్రీదేవి మరణంపై ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతున్నారు. అయితే ఇక శ్రీదేవి ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా ఎదగడానికి శ్రీదేవి ఎంతో కష్టపడ్డారు.. ఎంతో కష్టపడి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా మారారు.
అతిలోకసుందరిగా తన అందాన్ని కాపాడుకోవడానికి శ్రీదేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని టాక్ వినిపిస్తుంది. ఏకంగా ఆమె అందాన్ని కాపాడుకోవడానికి ఏకంగా 29 సర్జరీలు చేయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి సర్జరీల గురించి బీ టౌన్ లో వార్తలు షికారు చేస్తున్నాయి.