సాంప్రదాయమైన క్యారెక్టర్లలో నటించి ఏమాత్రం గ్లామర్కు ఆస్కారం ఇవ్వకుండా.. తన నటనతోనే భారీగా పాపులారిటీ సాధించింది ఈ అందాల నటి. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో జత కట్టిన సౌందర్యను.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. కన్నడ కస్తూరి అయిన సౌందర్య.. పేరు, గుర్తింపు మాత్రం తెలుగు సినిమాల ద్వారానే తెచ్చుకుంది. ఆమె మన మధ్య లేకపోయినా.. నటించిన చిత్రాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. అయితే సౌందర్య.. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె నాన్న సత్యనారాయణ అయ్యర్ కన్నడలో రైటర్గా, నిర్మాతగా రాణించారు. పలు సినిమాలు నిర్మించారు. రైటర్గానూ పనిచేశారు.
తండ్రి కారణంగానే సినిమాల్లోకి వచ్చింది సౌందర్య. ఓ మూవీలో చిన్న పాత్ర కోసం ఓ అమ్మాయి కావాలంటే తన కూతురు ఉంది కదా అని సౌందర్యని స్కూల్ నుంచే తీసుకెళ్లారట. అప్పటికీ సౌందర్యకి సినిమాలంటే ఇష్టం లేదు. మొదట్లో వ్యతిరేకించింది కూడా, కానీ మరో ప్రత్యామ్నాయం లేక సౌందర్యని నటిగా మార్చాల్సి వచ్చింది. అందులో ఆమెది కాసేపు కనిపించే పాత్రనే పెద్దగా ప్రయారిటీ లేదు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో చదువు పక్కన పెట్టి సినిమాల్లోకి వచ్చేసింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె చదువుని పూర్తిగా వదిలేసింది. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఆమె కెరీర్ మారిపోయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి.
తెలుగులో బిజీ అయ్యింది. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయాల్సి వచ్చింది. దీంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరోయిన్గా పీక్లో ఉన్న సమయంలోనే సౌందర్య నాన్న చనిపోయాడు. ఆయన హఠాన్మరణంతో సౌందర్య కుంగిపోయింది. చాలా డిస్టర్బ్ అయ్యింది. ఈ క్రమంలో తనకు ఓ ఆలోచన వచ్చింది. నాన్న కోసం ఏదైనా చేయాలనిపించింది. ఈక్రమంలోనే ఆమె నిర్మాతగా మారింది. నాన్నకి ట్రిబ్యూట్గా సినిమా చేయాలని నిర్ణయించుకుంది. నాన్న పేరుతోనే బ్యానర్ని లాంఛ్ చేసింది. సౌందర్య సత్య మూవీ మేకర్స్
పేరుతో కొత్తగా నిర్మాణ సంస్థని ప్రారంభించి 2002లో ద్వీప
అనే సినిమాని నిర్మించింది.
ఇది కన్నడలో తెరకెక్కిన చిత్రం. దీనికి గిరీష్ కాసరవల్లి దర్శకుడు. ఫీమేల్ ఓరియెంటెడ్గా దీన్ని తెరకెక్కించారు. ఇందులో లీడ్ రోల్లో సౌందర్యనే నటించడం విశేషం. పేదల జీవితాలను ఆవిష్కరించే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్గా ఫర్వాలేదనిపించింది. కానీ పెద్ద హిట్ కాదు. కానీ ఫర్వాలేదనిపించుకుంది. క్రిటిక్స్ మన్ననలు పొందింది. తండ్రికి నిర్మాతగా ఓ ట్రిబ్యూట్ ఇచ్చింది. అయితే ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం విశేషం. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా, అలాగే కెమెరా వర్క్ లో మరో జాతీయ అవార్డుని అందుకుంది.
ఆ తర్వాత మళ్లీ ప్రొడక్షన్ చేయలేదు సౌందర్య. సౌందర్య చివరగా శివ శంకర్
చిత్రంలో నటించింది. మోహన్బాబుకి జోడీగా చేసింది. ఈ సినిమా ఆడలేదు. ఆమె నటించిన నర్తనశాల
మధ్యలోనే ఆగిపోగా, నాలుగేళ్ల క్రితం ఓటీటీలో విడుదల చేశారు. ఇక సౌందర్య 2004లో ఎన్నికల ప్రచారం కోసం హెలికాఫ్టర్లో ట్రావెల్ చేస్తుండగా, ఆ ప్రమాదంలో సౌందర్య చనిపోయారు. అందులో తన సోదరుడు అమర్నాథ్ కూడా ఉండటం విచారకరం.