‘కుబేర’ చూసినవాళ్లు శేఖర్ కమ్ముల విజన్ని మెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసేందుకు ఈయన కూతురు కూడా వచ్చింది. బయటకొచ్చి తనదైన రివ్యూ కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే కుబేర సినిమాను మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ క్రమంలో కుబేర సినిమా చూసిన వాళ్లందరూ శేఖర్ కమ్ముల టేకింగ్ ను మెచ్చుకుంటున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసేందుకు శేఖర్ కమ్ముల కూతురు వందన కూడా వచ్చింది. సినిమా పూర్తయ్యాక బయటకు వచ్చి తనదైన శైలిలో రివ్యూ కూడా ఇచ్చింది. ’మా టీమ్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మేం చాలా చాలా చెప్పాం. దానికి మించి ఉంది సినిమా’ అని శేఖర్ కమ్ముల కూతురు వందన చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. శేఖర్ కమ్ముల పెద్దగా బయట కనిపించరు.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండరు. అందుకే ఆయన కుటుంబ సభ్యుల గురించిన సమాచారం చాలా మందికి తెలియదు. అలాంటిది శేఖర్ కమ్ముల కూతురు వందన ఇప్పుడిప్పుడే బయట కనిపిస్తోంది. సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ సందడి చేసింది వందన. ఇప్పుడు ఏకంగా తన తండ్రి సినిమాకు రివ్యూ ఇస్తూ వైరల్ అయిపోతోంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూతురు ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు నెటిజన్లు..ఈ డైరెక్టర్ కు ఇంత పెద్ద కూతురుందా అని ఆశ్చర్యపోతున్నారు. వందనను చూస్తుంటే తండ్రిలానే సినిమాల్లోకి వస్తుందేమో అనిపిస్తుందేమోనంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
Sekhar Kammula's daughter, Vandana, raves about #Kuberaa: 'It's beyond what we expected.' A gripping tale of ambition and morality that’s winning hearts. #Dhanush #Nagarjuna #RashmikaMandanna pic.twitter.com/g9i0lwYyrI
— Telangana Beats (@TelanganaBeats) June 20, 2025