శాంతిప్రియకు నిశాంతి అని మరో పేరు ఉంది. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన ఎంగ ఊరు పాటుక్రన్ చిత్రం ఆమె కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. అయితే తెలుగులో మహర్షి, కలియుగ అభిమన్యుడు, సింహ స్వప్నం.. లాంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శాంతి ప్రియ.
నటిగా బిజీగా ఉన్న సమయంలోనే 1999లో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్రాయ్ను వివాహం చేసుకుంది. అయితే 2004లో గుండెపోటుతో సిద్ధార్థరాయ్ కన్నుమూశాడు. అప్పటి నుంచే ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాడ్ గర్ల్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది.

ఇదే క్రమంలో గుండుతో ఉన్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. మహిళలందరూ తమకు నచ్చినట్లు బతకాలంటూ చనిపోయిన తన భర్త సిద్ధార్థ్ రాయ్ బ్లేజర్ ధరించి సందేశమిచ్చింది. ఇక ఈ మధ్యన గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కూడా నెట్టింట వైరలవుతున్నాయి.