ఆ స్టార్ హీరో వంశంలో 50 ఏళ్లకు మించి ఒక్కరు కూడా బ్రతకలేరు, కారణం ఏంటో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

అప్పుడెప్పుడో 16 ఏళ్ల కిందట వచ్చిన మగధీర సినిమాలో.. కాల భైరవ వంశంలో ఒక్కరు కూడా 30 ఏళ్లకు మించి బ్రతకరు అని విన్నాం. కాగా, ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక స్టార్ హీరో ఫ్యామిలీలో పురుషులు సైతం 50 ఏళ్లకు మించి బ్రతకరు. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు సంజీవ్ కుమార్. ఇప్పటి తరానికి ఈ హీరో గురించి పెద్దగా తెలియదు కానీ.. అసలు ఒకప్పుడు సంజీవ్ కుమార్ అంటే సంచలనం. ఆయన పేరు సంజీవ్ కుమార్.

ఒకప్పుడు బాలీవుడ్ నాట సంజీవ్ కుమార్ క్రేజ్ మాములుగా ఉండేది కాదు. అసలు ఆయన సినిమా రిలీజవుతుందంటే.. ఆడియెన్స్ థియేటర్‌లకు పరుగులు తీసేవారు. కొన్ని వారాల పాటు హౌజ్ ఫుల్ బోర్డులు ఉండేవి. అంతేకాదు ఆయన సినిమా రిలీవజతుందంటే.. అప్పట్లో జనాలు.. ముందు రోజు నుంచే లైన్‌లో నిల్చునేవారు. అంతటి క్రేజ్ తెచ్చుకున్న హీరో సంజయ్ కుమార్. హీరోగానే కాకుండా వయసు మళ్లిన పాత్రల్లో కూడా టెర్రిఫిక్‌గా నటించేవాడు.

ఆలీబాబా ఔర్ 40 చోర్, స్మగ్లర్, కలాపి, రాజ్ ఔర్ రంక్, గౌరీ, అంగూర్, ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయకుడిగా పేరొందాడు. అలా కెరీర్ ఒక రేంజ్‌లో ఉన్నప్పుడే గుండెపోటుతో 47 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. నిజానికి వీళ్ల కుటుంబంలో ఎవ్వరు కూడా 50ఏళ్లకు మించి బ్రతకలేరట. సంజీవ్ కుమార్‌తో పాటు వాళ్ల తాత, తండ్రి, తమ్ముడు నికుల్‌తో సహా అతడి కుటుంబంలోని పురుషులందరూ 50 ఏళ్లు నిండకముందే మృతిచెందారు.

ఇదే విషయమై సంజీవ్ కుమార్‌ బ్రతికున్నప్పుుడ ఓ ఇంటర్వూయర్ అడిగాడట. మీరు వృద్దాప్య రోల్స్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా అని. దానికి సంజయ్ కుమార్ బదులుగా.. ఎందుకంటే నా వృద్ధాప్యాన్ని నేను ఎప్పటికీ చూడలేను. ఆ కారణం వల్లే వృద్ధాప్య పాత్రలు చేస్తున్నానని బదులిచ్చాడట. ఆయన చెప్పిన విధంగానే.. వృద్ధాప్యాన్ని చూడకుండానే.. కేవలం 47ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *