ప్రస్తుతం సనా ఖాన్ షేర్ చేసుకున్న ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా సనా ఖాన్ కు చాలామంది సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు సానుభూతి తెలుపుతున్నారు. అయితే టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సనాఖాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వయసు సంబంధిత సమస్యలతో పాటు గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె తల్లి మంగళవారం కన్నుమూశారు.
ఈ విషయాన్ని సదరు హీరోయినే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మా అమ్మ అల్లాహ్ దగ్గరకు వెళ్లిపోయిందంటూ ఎమోషనల్ అయ్యింది. ‘నా ప్రియమైన అమ్మ, శ్రీమతి సయీదా, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. ఇషా నమాజ్ అనంతరం ఓషివారా ఖబ్రస్థాన్లో అంత్యక్రియలు జరుగుతాయి. అమ్మ ఆత్మశాంతి కోసం మీరంతా ప్రార్థించాలని కోరుతున్నాను’ అంటూ సనా తన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. తల్లి మరణంతో తీవ్ర దుఖంలో మునిగిన నటిని పలువురు సినీ ప్రముఖులు ఓదారుస్తున్నారు. అలాగే సినీ అభిమానులు, నెటిజన్లు సనాకు సంతాపం తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు. సనాఖాన్ విషయానికి వస్తే.. కల్యాణ్ రామ్ కత్తి(2010) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందీ అందాల తార. గగనం, మిస్టర్ నూకయ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. ముఖ్యంగా హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ చిత్రం, ‘స్పెషల్ ఆప్స్’ వంటి వెబ్ సిరీస్ లతో పాపులర్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ హిందీ షోలోనూ సందడి చేసింది.