రెండు సార్లు అబార్షన్ తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చినతెలుగు హీరోయిన్.

divyaamedia@gmail.com
2 Min Read

యాంకర్ సమీరా షరీఫ్ అందరికి పరిచయమే. తన అత్త బాటలోనే సీరియల్స్ లో, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. యాంకర్ గా కూడా ఓ షోతో మెప్పించింది. ప్రస్తుతం యాక్టింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో, యూట్యూబ్ వీడియోలతో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. అయితే సమీరా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు, పండంటి మగ బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టిందీ అందాల తార.

‘బుడ్డోడు మా జీవితాల్లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా జీవితాల్లో కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నాం’ అని తన పోస్టులో రాసుకొచ్చింది సమీరా. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు సమీరా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నాలుగు సార్లు గర్భం దాలిస్తే.. కాగా సమీరా షెరీఫ్ 2019లో అన్వర్‌ జాన్‌ అనే వ్యక్తితో కలిసి పెళ్లి పీటలెక్కింది. ఆ మరుసటి ఏడాదే ఆమె మొదటి సారి గర్భం దాల్చింది. అయితే అప్పుడు సమీరా తమిళంలో ఓ రియాలిటీ షో చేస్తోంది. షూటింగ్‌ కంప్లీట్ చేసుకుని ఆస్పత్రికి వెళదామనుకుంది. అయితే అంతలోనే తీవ్ర రక్తస్రావమైం కావడంతో కడుపులో బిడ్డను పోగొట్టుకుంది. ఈ చేదు అనుభవం తర్వాత 2021లో మరోసారి గర్భం దాల్చింది సమీరా. అప్పుడు ఆమెకు అర్హాన్‌ జన్మించాడు.

ఇక 2023లో మరోసారి ప్రెగ్నెంట్‌ కావడంతో సమీరా ఎంతో సంబరపడింది. మరో బిడ్డ తన జీవితంలోకి వస్తున్నాడని అందరితో చెప్పుకుని మురిసిపోయింది. కానీ.. కానీ బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో గర్భం నుంచి శిశువును తీసేశారు. దీంతో సమీరా బాగా తల్లడిల్లిపోయింది. ఇక 2024 చివర్లో మరోసారి ప్రెగ్నెంట్‌ అని తేలగా.. ఇప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సమీరా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *