ట్రయథ్లాన్ రెండుసార్లు పూర్తి చేసి రికార్డు సృష్టించిన టాలీవుడ్ హీరోయిన్. ఎవరో గుర్తు పట్టరా..?

divyaamedia@gmail.com
2 Min Read

గత ఏడాది సెప్టెంబర్ 2024లో బెర్లిన్‌లో తొలిసారి ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌ను పూర్తిచేసిన సయామీ, కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే రెండోసారి ఈ ఘనతను అందుకున్నారు. అయితే ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆమె విదేశాల్లో నిర్వహించే ట్రయథ్లాన్‌ పోటీల్లో పాల్గొంటోంది. అలా ఏడాది వ్యవధిలో రెండు సార్లు ఐరన్‌మ్యాన్‌ 70.3 మారథాన్ ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా తాజాగా రికార్డు నెలకొల్పింది.

గతేడాది సెప్టెంబరులో తొలిసారిగా మెడల్‌ అందుకున్న ఆమె.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది. ట్రయథ్లాన్ … పేరుకు తగ్గట్టుగానే ఈ పోటీలో మూడు రేసులుంటాయి. 1.9 కి.మీ. స్విమ్మింగ్, 90 కి.మీ. సైక్లింగ్, 21.1 కి.మీ. పరుగు ట్రయథ్లాన్‌లో భాగం. అత్యంత కష్టమైన పోటీల్లో ఇదొకటి. అందుకే శారీరకంగా, మానసికంగా ఎంతో బలంగా ఉన్నవారే ఈ పోటీల్లో పాల్గొంటారు.

ఈ క్రమంలో 2024 సెప్టెంబర్‌లో తొలిసారి ఈ ట్రయథ్లాన్‌ను పూర్తి చేసిన నటి.. తాజాగా జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో తన రెండో ఐరన్‌ మ్యాన్ 70.3ను విజయవంతంగా పూర్తి చేసింది. తొలిసారి కంటే రెండోసారి 32 నిమిషాల ముందే ఈ రేస్ పూర్తిచేయడం విశేషం. రేస్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుందీ అందాల తార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్త పట్టారా? తను మరెవరో కాదు తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించిన సయామీ ఖేర్.2015లో తెలుగు చిత్రం రేయ్‌తో సినిమాల్లోకి అడుగు పెట్టింది సయామీఖేర్. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ గా నటించాడు. దీని తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించింది. ఇక 2021లో నాగార్జున అక్కినేనితో కలిసి వైల్డ్ డాగ్ మూవీలో NIA ఏజెంట్‌గా నటించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాట్‌’లో కీలక పాత్ర పోషించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *