హాస్పిటల్ లో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. ఆమెకు ఏమైందంటే..?

divyaamedia@gmail.com
1 Min Read

తండేల్ చిత్రం విస్తృతమైన ప్రచార కార్యక్రమాల కారణంగా సాయి పల్లవికి జ్వరం వచ్చిందని తెలియ చేసారు. సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె ‘తండేల్’ సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని… దీంతో ఆమె మరింత నీరసించిపోయారని చెప్పారు. అయితే ఇప్పటికే వైజాగ్, హైదరాబాద్, ముంబై, చెన్నైలో తండేల్ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. హీరోయిన్ సాయి పల్లవి అనారోగ్యానికి గురయ్యారని కొన్ని రోజులుగా వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ వార్తలపై స్పందించారు డైరెక్టర్ చందు మొండేటి. ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఆమె రాకపోవడంపై స్పందిస్తూ సాయి పల్లవి హెల్త్ అప్డేట్ ఇచ్చారు. “సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఆమె సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమె మరింత నీరసించారు. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజులపాటు బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు.

అందుకే ఆమె ముంబై వేదికగా జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు” అంటూ చెప్పుకొచ్చారు చందు మొండేటి. తండేల్ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ ప్రేమకథలో రాజుగా నాగచైతన్య, బుజ్జితల్లిగా సాయి పల్లవి కనిపించనున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరెకక్కించిన లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *