ఇండస్ట్రీలో పెను విషాదం,ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటి. ఏం జరిగిందంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

‘జీవ హూవాగిదే’, ‘సంఘర్ష’, ‘గౌరి’ వంటి ఆదరణ పొందిన సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నందిని సి.ఎం. బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కన్నడ, తమిళ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నందిని అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు కానీ.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని తన ఇంటిలోనే నటి బలవన్మరణానికి పాల్పడిందని సమాచారం. ప్రస్తుతం ఈ మరణ వార్త కన్నడ, తమిళ సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నటి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. కాా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నందిని తెలుగులో కాకుండా కన్నడ, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన ‘గౌరి’ సీరియల్ నందినీకి బోలెడంత క్రేజ్ తీసుకొచ్చింది.

అలాగే కన్నడ సీరియల్స్ ‘జీవా హూవాగే’, ‘నీనాదే నా’, ‘సంఘర్ష’, ‘మధుమగల్’ లలో ఆమె నటనకు బుల్లితెర ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. సీరియల్స్ లో ఆమె పోషించిన దుర్గ, కనక పాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి. కాగా గౌరీ గత కొన్ని రోజులుగా బెంగళూరులో ఉంటోంది. ఒక పీజీలో ఉంటూ సీరియల్స్ షూటింగ్ కు హాజరవుతోంది. అయితే ఇప్పుడు ఆమె తన తల్లికి డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రాథమిక ఆధారాలు సేకరించి నటి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. నందిని మరణ వార్తను తెలుసుకుని ‘గౌరి’ సీరియల్ బృందం షాక్ అయ్యారు. సన్నిహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు నందినికి నివాళులు అర్పిస్తున్నారు. గౌరీకి ప్రస్తుతం సీరియల్స్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *