యువతు సోషల్ మీడియాలో రోజు రోజుకూ రీల్స్ పైత్యం పెరిగిపోతుంది. లైక్స్, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. మరికొన్ని సార్లు చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడుతున్నారు. అయితే కేరళ రాష్ట్రంలో కన్నూర్లో సినిమా రీల్స్ కోసం..
వెళుతున్న రైలును ఆపినందుకు ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులను అరెస్టు చేశారు. ఎర్నాకుళం నుండి పూణేకు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలును ఆపారు. గురువారం ఉదయం తలస్సేరి, మాహే మధ్య ఈ సంఘటన జరిగింది. రైలు ట్రాక్ పై ఎర్రటి లైట్ వెలిగించడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. అది ప్రమాద సంకేతంగా భావించి రైలును ఆపారు.
ఈ సమయంలో విద్యార్థులు రైల్వే ట్రాక్ దగ్గర రీల్స్ చిత్రీకరిస్తున్నారని.. ప్రమాద సంకేతమనుకుని.. పైలట్ ట్రైన్ ను ఆపారని.. పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన తర్వాత, లోకో పైలట్ RPF, రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దర్యాప్తు తర్వాత, ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులను అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన తర్వాత వారిని బెయిల్పై విడుదల చేశారు. విద్యార్థులు చిత్రీకరించిన వీడియోను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
റീൽ ചിത്രീകരിക്കാൻ ചുവപ്പ് ലൈറ്റ് അടിച്ച് ട്രെയിൻ നിർത്തിച്ചു, സംഭവത്തിൽ രണ്ട് പ്ലസ് ടു വിദ്യാർത്ഥികളെ കണ്ണൂർ റെയിൽവേ പോലീസ് അറസ്റ്റ് ചെയ്ത് ജാമ്യത്തിൽ വിട്ടു.
— DD News Malayalam (@DDNewsMalayalam) December 25, 2025
ഇന്ന് പുലർച്ചെ തലശ്ശേരിക്കും മാഹിക്കും ഇടയിൽ എറണാകുളം – പൂനെ എക്സ്പ്രസാണ് നിർത്തിച്ചത്.#indianrailways #Kannur… pic.twitter.com/YC50vwXJUj
