శాస్త్రోక్తంగా చండీ హోమం చేసిన రేణూ దేశాయ్. ఆ హోమం ఎందుకు చేసిందో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

మన పూర్వీకులు అనుసరించిన సాంప్రదాయాలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉంది. అందుకని డెకరేషన్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ‘శరద్ పూర్ణిమ సందర్భంగా మా ఇంట్లో గణపతి, చండీహోమం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించాం. మన సాంప్రదాయలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాలి. పూజ సమయంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా, ప్రశాంతంగా భక్తి మీదనే దృష్టి పెట్టాలి’ అని ఈ పోస్టులో రాసుకొచ్చింది రేణు దేశాయ్.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా రేణు దేశాయ్ కు దేవుడిపై భక్తి ఎక్కువ. ఈ క్రమంలోనే ఆమె తరచూ పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అదే సమయంలో పండగల పేరుతో కొందరు చేస్తోన్న హంగులు, ఆర్భాట కార్యక్రమాలను తప్పుపడుతూ ఉంటుంది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఒక పోస్ట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సింగిల్ మదర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోన్న రేణూ దేశాయ్ తన పిల్లలు ఆద్య, అఖిరా నందన్ ల బాధ్యతలను చూసుకుంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో రేణూ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు.

కానీ అదేమీ జరగలేదు. ఈ సినిమా రిలీజై కూడా ఏడాది గడిచింది. అయితే మళ్లీ కెమెరా ముందుకు వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందీ అందాల తార. అయితే అది సినిమానా? వెబ్ సిరీస్ నా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *