సోమవారం నాడు ఇన్స్స్టాగ్రామ్ వేదికగా రాశీ ఖన్నా ఈ ఫోటోలను షేర్ చేశారు. ఈ చిత్రాలలో, ఆమె ఒక సాధారణ టీ-షర్ట్, నల్లటి ప్యాంటు ధరించి, తీవ్రమైన గాయాలతో కనిపించారు. “కొన్ని పాత్రలు అడగవు… అవి డిమాండ్ చేస్తాయి… మీ శరీరాన్ని, మీ శ్వాసను, మీ గాయాలను కూడా అవి కోరుకుంటాయి… మీరే ఒక తుపాను అయినప్పుడు ఇక ఉరుములు, పిడుగులు ఓ లెక్కా?… త్వరలో వస్తోంది…” అంటూ తన పోస్ట్కు క్యాప్షన్ జోడించారు.
అయితే ఒకప్పుడు హీరోయిన్ రాశిఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసి మంచి విజయాలు సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా కనిపించడం లేదీ అందాల తార. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా అనే సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇందులో శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
తెలుగులో జోరు తగ్గినా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తోందీ అందాల తార. ఆ మధ్యన సబర్మతీ ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రాశీ ఖన్నా. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఓ హిందీ సినిమా, వెబ్ సిరీస్ ఉన్నాయి.