బిగ్‌బాస్‌లోకి వైరల్‌ వయ్యారి, క్షణికావేశంలోనే ఆ తప్పు చేశా అంటూ నిజం ఒప్పుకున్న రమ్య మోక్ష.

divyaamedia@gmail.com
2 Min Read

సోషల్ మీడియాలో మారుమోగిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య అలియాస్ రమ్య మోక్ష. ఆమె గురించి కొన్ని విషయాలు అందరికీ తెలుసు. తెలియని మరికొన్ని విషయాలు ఉన్నాయి. అలేఖ్య.. చిట్టి.. రమ్య ముగ్గురు అక్కా చెల్లెల్లు. వీరు ముగ్గురూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రమ్య.

అయితే ‘ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి రావడం ఆనందంగా ఉంది.. హౌస్‌లో ఎంటర్ టైన్‌మెంట్ అనేది లేదని, నేను వెళ్లి అసలు ఎంటర్‌టైన్ అంటే చూపిస్తాను. ప్రస్తుతం బిగ్ బాస్ హౌసులో తనకు నచ్చిన కంటెస్టెంట్ ఒక్కరూ లేరు. కానీ నచ్చని కంటెస్టెంట్ మాత్రం భరణి’ అని బాంబు పేల్చింది రమ్య మోక్ష. ఈ సందర్భంగా ఆమెకు లగ్జరీ ఫుడ్ అనే అవకాశం ఇస్తున్నట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు.

కాగా ఎప్పటికైనా మూగ జీవాల కోసం షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసి, దాన్ని అమల గారితో ఓపెన్ చేయించాలనే కోరిక ఉందని రమ్య తెలిపింది. ఈ సందర్భంగా ప్రస్తుతం హౌస్‌లోని ఐదుగురికి రకరకాల పచ్చడి ఇవ్వాలని రమ్యకు టాస్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా రమ్య తన అగ్రెసివ్ నెస్ ను చూపించింది. ఓవరాక్టింగ్ పచ్చడి (శ్రీజ) అని, సెల్ఫీష్ పచ్చడి (పవన్) అని,

సేఫ్ గేమ్ పచ్చడి (భరణి), ఫేక్ పచ్చడి (దివ్య నికితా) అని, మ్యానిప్యులేటర్ పచ్చడి (రాము రాథోడ్) అని ఏకిపారేసింది. మొత్తానికి హౌస్ లోకి వచ్చీ రాగానే కంటెస్టెంట్లకు బాగానే చురకలు అంటించింది రమ్య మోక్ష. మరి ఆటలో ఏ మాత్రం ట్యాలెంట్ చూపిస్తుందో చూడాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *