కాదని చెప్పలేక తప్పులు చేశాను, పెళ్ళై పిల్లలు పుట్టాక తెలుసుకున్న హీరోయిన్ రంభ.

divyaamedia@gmail.com
2 Min Read

నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రంభ. తన గ్లామర్ తో అప్పటి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేశారు రంభ. చాలా మంది స్టార్ హీరోలు రంభ డేట్స్ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగారు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్స్పోజింగ్ లో ముంబై తారలను డామినేట్ చేసింది రంభ. ఆమె ఒకటి రెండు చిత్రాల్లో బికినీ కూడా ధరించింది. అందుకే రంభకు ఆ రోజుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది.

కుర్రకారు ఆమె అంటే పడిచచ్చే వారు. క్యూట్ ఫేస్, హాట్ ఫిగర్ తో ఆమె మెస్మరైజ్ చేసేది. ఈ ఎక్స్పోజింగ్ పై రంభ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయాల్సి వచ్చిన సందర్భాల్లో ఇబ్బందిపడ్డారా? అని అడగ్గా… పరిశ్రమలో ఎక్స్పోజ్ చేయను అని చెప్పడం కష్టం. ఏ ప్రాజెక్ట్ చేసినా ఎవరో ఒకరు తెలిసినవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు నో చెప్పాను.

అందుకే మంచి ప్రాజెక్ట్స్ చేశాను. ఒకటి రెండు చిత్రాల విషయంలో తప్పులు చేశాను. చేయకూడని సినిమాలు చేశాను. ఎక్స్పోజ్ చేసినందుకు నేను బాధపడటం లేదు. నేను చేసిన మంచి సినిమాలు ఆ బాధను పోగొట్టాయి. కానీ చాలా సినిమాల విషయంలో నేను కండిషన్స్ పెట్టేదాన్ని. నా కండిషన్స్ కి ఒప్పుకుని చేసిన సినిమాలు బెస్ట్ అని చెప్పొచ్చు… అని రంభ వివరణ ఇచ్చారు. మడిగట్టుకు కూర్చుంటే కుదరదు.

కొన్ని సందర్భాల్లో ఎక్స్పోజ్ చేయకతప్పదని రంభ చెప్పకనే చెప్పింది.. రంభ 2010లో శ్రీలంక మూలాలు కలిగిన బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. వివాహం అనంతరం కెనడాలో స్థిరపడింది. రంభకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వివాహం అనంతరం రంభ సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. సోషల్ మీడియాలో రంభ యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాన్స్ తో తన ఫ్యామిలీ విశేషాలు పంచుకుంటారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *