ముఖేష్ సూసైడ్తో అతడి ఫ్యామిలీ తట్టుకోలేని బాధలో మునిగిపోయింది. ఇది సూసైడ్ కాదని ఆయన కూతురు విప్రా రావల్ వాదించింది. ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ఏ కారణం లేదని చెప్పింది. అయితే, 2000 సంవత్సరంలో, ముఖేష్ తన 18 ఏళ్ల కొడుకు ద్విజ్ను ఒక ట్రైన్ యాక్సిడెంట్లో కోల్పోయారు. అప్పటినుంచి డిప్రెషన్తో బాధపడుతున్నాడు. ఆయన భార్య చెప్పిన వివరాల ప్రకారం, ఆ బాధ నుంచి ముఖేష్ ఎప్పటికీ బయటపడలేదు. చివరి రోజుల్లో ఎక్కువగా ద్విజ్ గురించే మాట్లాడేవాడట.
తన కొడుకు ఎలా చనిపోయాడో, అలాగే ముఖేష్ కూడా తన లైఫ్ను ముగించుకోవాలని అనుకుని ఉండొచ్చని కొందరు భావించారు. అయితే ఆ రోజు పొద్దున్న, ముఖేష్ రావల్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇంట్లోంచి వెళ్లాడు. అక్కడ నుంచి ఒక గుజరాతీ షో డబ్బింగ్ స్టూడియోకి వెళ్లాలి. కానీ అక్కడికి రాలేదు. ఆ తర్వాత, అదే రోజు, రైల్వే ట్రాక్స్పై ఆయన శవమై కనిపించాడు. ఈ న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీని, ఫ్యాన్స్ను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది.

పోలీసులు దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే, ట్రైన్ అతడి మీదికి దూసుకెళ్లడానికి కొన్ని క్షణాల ముందు ట్రాక్స్పై పడుకుని ఉన్న సీన్ క్లియర్గా కనిపించింది. ట్రైన్ డ్రైవర్ ఆపడానికి ట్రై చేసినా, సాధ్యపడలేదు. పోలీసులు ఇది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి, సీసీటీవీ ఫుటేజ్ కూడా అదే చూపిస్తున్నా, కొందరు ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ దీన్ని నమ్మలేదు. ఫేమస్ యాక్టర్స్ పరేష్ రావల్, మనోజ్ జోషి లాంటి వాళ్లు ముఖేష్ ఎప్పుడూ నవ్వుతూ, హుషారుగా ఉండే మనిషి అని గుర్తుచేసుకున్నారు.
టైమ్ సేవ్ చేసుకోవడానికి ఆయనకు ట్రాక్స్ దాటే అలవాటు ఉందని, బహుశా అది కేర్లెస్నెస్ వల్ల లేదా కాలుజారి పడటం వల్ల జరిగి ఉండొచ్చని ఆయన కూతురు చెప్పింది. ముఖేష్ రావల్ చాలా పేరున్న సినిమా, టీవీ యాక్టర్. పాపులర్ సీరియల్ ‘రామాయణం’లో రావణుడికి మంచి మనసున్న తమ్ముడు విభీషణుడి క్యారెక్టర్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆయన యాక్టింగ్ ఆ క్యారెక్టర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అంతకుముందు, ఈ యాక్టర్ గుజరాతీ నాటకాల్లో సత్తా చాటాడు. ‘జిద్’, ‘మృత్యుదాత’, ‘సత్తా’ లాంటి ఎన్నో హిందీ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. గుజరాతీ టీవీ షోలు, సినిమాల్లో కూడా కనిపించాడు. బయటకు ఆయన చాలా కామ్గా, సింపుల్గా, లైఫ్ను ఇష్టపడే మనిషిలా ఉండేవాడు.