రజనీకాంత్ జపించే మంత్రం ఏంటో తెలుసా..? అయన విజనికి కారణం ఇదే.

divyaamedia@gmail.com
1 Min Read

రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు. అక్కడ ఆయన్ను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. అయితే ప్రసిద్ధ విద్యావేత్త డాక్టర్‌ శ్రీమతి వైజీపీ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ, “1987-88 సమయంలో మా ఇంట్లో ఒక కార్యక్రమం జరిగింది.

అప్పుడు, నేను శ్లోకాలు పఠించడం చూసి, శ్రీమతి వైజీపీ నాకు ఫోన్ చేసి, శ్లోకాలు ఇంత స్పష్టంగా ఎలా పఠిస్తున్నావని అడిగారు. నేను రామకృష్ణ ఆశ్రమంలో చదువుతున్నానని ఆమెకు చెప్పాను. అప్పుడు ఆమె, “ఈరోజు నుంచి ప్రతిరోజూ గాయత్రి మంత్రాన్ని జపించు. నువ్వు కళాకారుడివి. దీనివల్ల నీ ముఖంలో తేజస్సు పెరుగుతుంది. డైలాగులు చెప్పడం సులభమవుతుంది” అని అన్నారు.

ఆమె శిష్యులలో ఒకరు నాకు గాయత్రి మంత్రాన్ని నేర్పించారు. అది విన్న తర్వాత నేను దాని గురించి మర్చిపోయాను’ “నేను సత్యసాయి బాబా భక్తుడిని. ఒకసారి, నేను ఆయన ఆశీర్వాదం కోసం ఆయనను సందర్శించడానికి వెళ్ళినప్పుడు, భారతదేశం నుంచి అండమాన్ వెళ్తున్న విమానం కూలిపోయి 60 మందికి పైగా మరణించారు. దాని గురించి మాట్లాడుతూ, సత్యసాయి బాబా, ‘ఆ విమానంలో కనీసం ఒక్కరైనా గాయత్రి మంత్రాన్ని జపించి ఉంటే, ఆ విపత్తు తప్పేది’ అని అన్నారు.

అది విన్న వెంటనే, నేను మళ్ళీ గాయత్రి మంత్రాన్ని జపించడం ప్రారంభించాను. ప్రారంభంలో, నేను రోజుకు ఒకసారి గాయత్రి మంత్రాన్ని జపించేవాడిని. ఆ తర్వాత రోజుకు మూడు సార్లు, తర్వాత తొమ్మిది సార్లు, తర్వాత 24 సార్లు, ఇప్పుడు రోజుకు వంద సార్లు గాయత్రి మంత్రాన్ని జపించకుండా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టను’ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *