విడుదల రజినీకి బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు, కేసు నమోదు చేసిన పోలీసులు.

divyaamedia@gmail.com
1 Min Read

మాజీ మంత్రి విడదల రజినీపై కేసు నమోదుకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. 2019లో తాను ప్రశ్నించినందుకు తనను చిత్ర హింసలు పెట్టారంటూ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఆరోపించారు. గతంలో ఎన్నో సార్లు ప్రశ్నించినా.. ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన పేర్కొ్న్నారు. దీంతో రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

అయితే చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు… రజినీపై కేసు నమోదుకు ఆదేశాలివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు పిల్లి కోటి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను విడుదల రజినీ ఎన్నో ఇబ్బందులు పెట్టారని అన్నారు.

తనని చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలను లైవ్‌లో చూస్తూ రజిని పైశాచిక ఆనందం పొందినట్లు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చంపేస్తామని నాడు బెదిరింపులకు దిగారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు విడుదల రజనీ, ఆమె పీఏలు రామకృష్ణ, ఫణీంద్ర, అప్పటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గతంలోనూ పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావును కోరినట్లు వెల్లడించారు.

కానీ రజినీపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించాడు. ఇక పిల్లి కోటి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు… రెండు వారాల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని తీసుకుని ఎస్పీ శ్రీనివాసరావును మరోసారి కలిశారు పిల్లి కోటి. ఉత్తర్వులు పరిశీలించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *