వాతావరణ శాఖ హెచ్చరిక, బంగాళాఖాతంలో అల్పపీడనం, 3 రోజులు భారీ వర్షాలు.

divyaamedia@gmail.com
1 Min Read

రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో ఏపీలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈ సారి త్వరగా రాష్ట్రానికి రానున్నాయి. అయితే ఉత్తరాంధ్ర ఒడిశాకు ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సరూప తెలిపారు.

ఇది భూమి ఉపరితలం నుండి 5.8, 7.6 కిలోమీటర్లు ఆవరించి ఉంది. ఇది దక్షిణ వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు మూడు రోజులపాటు భారీ వర్షం ఉందని తెలిపారు.

రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం ఇలా ఐదు జిల్లాలకు భారీ వర్షం సూచన ఉందని తెలిపారు. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు.

అప్పుడప్పుడు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలిని వీచే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ వరకు వ్యాపించాయని తెలుపుతున్నారు. ఇంకా మరికొన్ని రాష్ట్రాలు మిగిలి ఉన్నాయి అని అన్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ కొన్ని ప్రాంతాలు మిగిలి ఉన్నాయి అని అన్నారు. మొత్తం దేశం అంతా విస్తరించినట్లే అని అన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *