నాగచైతన్య మాజీ భార్య సమంత, నాగచైతన్య ప్రస్తుత భార్య శోభిత గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. సమంతకు శోభితా కన్నా అభిమానులు ఎక్కువే. అయితే నాగచైతన్య అభిమానులు మాత్రం శోభితాని సపోర్ట్ చేస్తూ వస్తుంటారు. అయితే 2022లో సామ్, చైతన్య విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఆతర్వాత ఈ ఇద్దరి గురించి చాలా వార్తలు వచ్చాయి. విడిపోయిన తర్వాత చైతన్య తన సినిమాలతో బిజీ అయ్యాడు. సామ్ కూడా సినిమాలు చేసింది.
ఆతర్వాత మాయోసైటిస్ బారిన పడింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే సామ్ రికవర్ అవుతుంది. అలాగే సినిమాలతో బిజీ అవుతుంది. ఇక నాగ చైతన్య రీసెంట్ గా శోభిత దూళిపాళ్లను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గానే వీరి వివాహం జరిగింది. అయితే ఇప్పుడు సమంత, శోభిత ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
సమంత దాదాపు 15 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ అమ్మడి ఆస్తులు దాదాపు రూ. 101కోట్లు వరకు ఉన్నాయి. అంతే కాదు సమంత కొన్ని యాడ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. వీటితో పాటు సఖీ అనే క్లాతింగ్ బ్రాండ్, ఏకం స్కూల్ కూడా ఉన్నాయి. ఇలా సామ్ రెండు చేతుల సంపాదిస్తున్నారు. కాగా శోభిత దూళిపాళ్ల 8ఏళ్లుగా సినిమా ఇండస్త్రీలో ఉన్నారు.
ఈ చిన్నది దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయిలు సంపాదించిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాగ చైతన్య ఆస్తులతో కలిపితే అంటే రూ. 154 కోట్లు కలిపితే ప్రస్తుతం ఆమెకు 164 కోట్ల ఆస్తులు ఉన్నాయని అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక శోభిత, చైతన్య పెళ్లి తర్వాత ఆలయాలను సందర్శిస్తున్నారు.