స్టార్ నిర్మాత ఇంట తీవ్ర విషాదం, క్యాన్సర్ తో 20 ఏళ్ల కూతురు మృతి.

divyaamedia@gmail.com
1 Min Read

టీ-సిరీస్ సీఈవో భూషణ్ కుమార్ బంధువు తీషా జూలై 18న తుది శ్వాస విడిచారు. ఆమె గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, తీషా క్యాన్సర్ చికిత్స జర్మనీలో కొనసాగుతోంది. తీషా తుది శ్వాస విడిచారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సెన్సెషన్ హిట్ అయ్యింది. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన కృష్ణన్ కుమార్ గారాల పట్టి తిషా కుమార్(21) కన్నుమూసింది.

గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న తిషా కుమార్ జర్మనీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సీరీస్ ధృవీకరించారు. ఈ సందర్భంగా తీషా మరణం కృష్ణన్ కుమార్ కుటుంబానికి తీరని లోటు..T-సిరీస్ ప్రతినిధి వారి బాధను వ్యక్తం చేశారు.

బాలీవుడ్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థ టీ-సీరీస్. దీన్ని భూషన్ కుమార్ చూసుకుంటున్నారు.. ఆయనకు చిన్నాన్న కృష్ణన్ కుమార్. ప్రస్తుతం టీ-సీరీస్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. 1995 లో ‘బేవఫా సనమ్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన నిర్మాణ రంగం వైపు వచ్చారు. ఈ క్రమంలోనే గత ఏడాది సూపర్ హిట్ అయిన ‘యానిమల్’ కి నిర్మాతగా వ్యవహరించారు.

ఆయన ముద్దుల కూతురు తిషా చిన్న వయసులోనే కన్నుమూయడం తీవ్ర విచారకరం. తిషా మరణ వార్త తెలిసిన ఇండస్ట్రీలో ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *