సినీ ఇండస్ట్రీలో విషాదం, 38 ఏళ్లకే క్యాన్సర్ తో ప్రముఖ హీరోయిన్ మృతి.

divyaamedia@gmail.com
2 Min Read

మరాఠీకి చెందిన నటి ప్రియా మరాఠే 1987 ఏప్రిల్ 23న ముంబయిలో జన్మించింది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. అనంతరం మరాఠీ సీరియల్ ‘యా సుఖనోయ’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు హిందీ, మరాఠీ సీరియల్స్లో నటించింది. బాలీవుడ్లో పవిత్ర రిష్టా సీరియల్తో ఆమె గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ప్రియా మరాఠే గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. అయితే మొదట్లో ఆమె చికిత్సకు బాగా స్పందించినప్పటికీ.. ఆ తర్వాత సడెన్ గా మళ్ళీ తిరగబడింది. చివరకు శరీరం చికిత్సకు సహకరించకపోడంతో అకాలంగా మరణించింది ప్రియా. యాక్టింగ్ కెరీర్..1987 ఏప్రిల్ 23న ముంబైలో పుట్టి పెరిగిన ప్రియా.. అక్కడే చదువు పూర్తి చేశారు.

ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులు వేశారు. మొదట టెలివిజన్ ప్రజెంటర్, సీరియల్స్ తో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. యా సుఖనోయ’, ‘చార్ దివాస్ సాసుచే’ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. 2006 లో ‘ఏక్తా కపూర్’ నిర్మించిన ‘కసమ్ సే’ సీరియల్ లో ‘విద్యా బాలి’ పాత్రతో ప్రియకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇది ఆమె కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన సీరియల్ గా నిలిచింది. ఆ తర్వాత ‘పవిత్ర రిష్ట’ సీరియల్ లో వర్ష సతీష్ పాత్ర ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టింది. ‘బడే అచ్చే లగ్తే హై’, ‘తూ టిథే మె’, ‘భాగే రే మన్’. ‘జయస్తుతే’, ‘భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్’ వంటి పలు సీరియల్స్ లో నటించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *