బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇటీవల 87 వేల పైకి చేరిన బంగారం ధర అక్కడ కూడా ఆగకుండా ఇంకా పెరుగుతోంది. అయితే పసిడి ప్రియులకు ఒక గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. బంగారం ధరలు దిగి రానున్నాయి. పసిడి రేటు రానున్న రోజుల్లో తగ్గొచ్చనే అంచనాలు నెలకున్నాయి. మన దేశంలో బంగారం ధరలు ప్రధానంగా విదేశీ మార్కెట్లోని రేట్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి.
అందుకే గ్లోబల్గా బంగారం ధరలు మారితే ఆ ప్రభావం మన దేశంలోని ప్రధాన నగరాల్లోని గోల్డ్ రేట్లపై కూడా ఉంటుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్స్కు 2900 డాలర్లకు దిగి వచ్చింది. దాదాపు 1.52 శాతం మేర క్షీణించింది. దీని వల్ల మన దేశంలో కూడా బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. మన దేశంలో చూస్తే.. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర నిన్న నిలకడగానే ఉంది. ట్రేడింగ్ ఆరంభంలో బంగారం ధర రూ. 86,020 వద్ద ప్రారంభం అయ్యింది.
కానీ తర్వాత ఆ స్థాయిలోనే కొనసాగలేకపోయింది. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా రూ. 84,710కు తగ్గింది. అంతేకాకుండా అమెరికాలో రిటైల్ సేల్స్ గణాంకాలు కూడా అంచనాల కన్నా బలహీనంగా నమోదు అయ్యాయి. దీని వల్ల కూడా బంగారంపై ఒత్తిడి నెలకుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా టెక్నికల్ చార్ట్స్ ప్రకారం చూస్తే.. బంగారం ధరలో బేరిష్ సిగ్నల్స్ కారణంగా రివర్సల్ ట్రెండ్ ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.