అమ్మవారికి ఈ పువ్వులతో పూజ చెయ్యండి, అమ్మవారు మీకోరిక వెంటనే తిర్చుతుంది.

divyaamedia@gmail.com
1 Min Read

నవరాత్రులలో దుర్గాదేవిని శక్తికి, జ్ఞానానికి ప్రతీకగా కొలుస్తారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. దుర్గాదేవి దైవిక స్త్రీ శక్తికి ప్రతిరూపం, దీనిని శక్తి అని కూడా పిలుస్తారు. నవరాత్రి పండుగ సందర్భంగా దుర్గాదేవిని తొమ్మిది శక్తివంతమైన రూపాల్లో పూజిస్తారు. అయితే హిందువులు పూజ చేసే సమయంలో పువ్వులకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది.

సరైన పువ్వులను సమర్పించడం దేవతను ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం అని ప్రతి భక్తుడి నమ్మకం. అయితే కొన్ని పువ్వులు వాటి అందానికి మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక శక్తి, ఆశీర్వాదాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. పవిత్ర గ్రంథాలలో పారిజాతం దేవతకు ఇష్టమైన పుష్పాలలో ఒకటిగా ప్రస్తావించబడింది. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, శక్తికి చిహ్నం.

పురాణాలు దీనిని దేవత రాక, ఆశీర్వాదాలకు చిహ్నంగా వర్ణించాయి. ఈ పువ్వు భక్తుల మనస్సులను శుద్ధి చేస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. పూజ సమయంలో పారిజాత పువ్వును శుభ్రంగా, తాజాగా ఉంచండి. దీనిని పూజ చేసే ప్రాంతం.. ప్రధాన గది లేదా వార్డ్‌రోబ్‌లో ఉంచవచ్చు. ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాదు దేవత ఆశీర్వాదం, సానుకూల శక్తి ప్రవాహాన్ని కూడా నింపుతుంది.

పారిజాతం సువాసన, దైవిక స్వభావం భక్తులకు దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. హిందూ సంప్రదాయంలో పారిజాతం పువ్వుని దుర్గాదేవి రాకకు చిహ్నంగా భావిస్తారు. ఈ పువ్వుతో పూజ చేయడం వలన ఆధ్యాత్మికంగా అనుసంధానించబడినట్లు భావిస్తారు. ఈ పువ్వు ఇంట్లో అదృష్టం, శాంతి, బలానికి చిహ్నంగా మారుతుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *