భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ సమయంలో భారత దళాలు సరిహద్దు సమీపంలోని అనేక పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి చేశాయి. అయితే ఈ ఆపరేషన్ ప్రభావాలు పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలో లోతుగా కనిపించాయని రక్షణ మంత్రి నొక్కి చెప్పారు. అయితే భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ.. నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమెర్ ఇవాన్ డి’కున్హా పాకిస్థాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
పాకిస్థాన్ భూభాగం అంత ఇండియా రేంజ్లో ఉందని అన్నారు. పాక్ తన సైనిక ప్రధాన కార్యాలయాన్ని రావల్పిండి నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా (కెపికె) వంటి ప్రాంతానికి మార్చినట్లు తెలుస్తోందని, అది కూడా సరిపోదని, వాళ్లు ఓ పెద్ద కలుగును కనుగొని అందులోకి దూరాలని ఎద్దేవా చేశారు. “పాకిస్తాన్ మొత్తం ఆ పరిధిలోనే ఉంది. పాకిస్తాన్ను మొత్తాన్ని టార్గెట్ చేసేంత ఆయుధశాల తమ వద్ద ఉంది. కాబట్టి, దాని సైనిక ప్రధాన కార్యాలయం పాక్లో ఎక్కడున్నా తమ పరిధిలోనే ఉంది.” అని లెఫ్టినెంట్ జనరల్ డి’కున్హా అన్నారు.
ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ సమయంలో భారత దళాలు సరిహద్దు సమీపంలోని అనేక పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి చేశాయి. అయితే ఈ ఆపరేషన్ ప్రభావాలు పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలో లోతుగా కనిపించాయని రక్షణ మంత్రి నొక్కి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం జరిపిన దాడి దాడులు పాకిస్తాన్లోని కీలకమైన వైమానిక స్థావరాలను కచ్చితంగా లక్ష్యంగా చేసుకున్నాయి. అధిక విలువ గల లక్ష్యాలను ధ్వంసం చేయడానికి సంచరిస్తున్న మందుగుండు సామగ్రిని ఉపయోగించాయి.
లాంగ్ రేంజ్ డ్రోన్లు, గైడెడ్ మందుగుండు సామగ్రితో సహా ఆధునిక స్వదేశీ సాంకేతికత ఆపరేషన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. నాలుగు రోజుల్లో పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు మీదుగా దాదాపు 800 నుండి 1000 డ్రోన్లను ప్రయోగించిందని, సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో చేసిన ప్రయత్నాల ద్వారా ఆయుధాలను మోసుకెళ్లే అన్ని డ్రోన్లను విజయవంతంగా అడ్డగించి నాశనం చేశామని ఆయన అన్నారు.
#WATCH | Delhi: DG Army Air Defence Lt Gen Sumer Ivan D’Cunha says, "India has an adequate arsenal of weapons to take on Pakistan right across its depth. So, from its broadest to its narrowest, wherever it is, the whole of Pakistan is within range… The GHQ (General… pic.twitter.com/U8jFcmIC8Y
— ANI (@ANI) May 19, 2025