కేవలం 25 నిమిషాల్లోనే భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం పాక్ పై ఎలా దాడులు చేసిందో చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఇండియన్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించాయి. పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కలుపుకొని మొత్తం తొమ్మిది లక్ష్యాలపై దాడులు చేసిన భారత్‌. అయితే సింధూ నది ప్రవహించే ప్రాంతాల్లో జరిగిన ఈ ఆపరేషన్‌ సింధూర్‌.. సింధూరాలు కోల్పోయిన మన ఆడపడచుల కన్నీటిని తుడిచింది. ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా అంటోంది మన భారతం.

రాత్రి నుంచే యువత రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఇది పర్ఫెక్ట్‌ మిషన్‌ అంటూ ప్రధాని మోదీనే ప్రకటించారు. కొన్ని ఏళ్లుగా ముష్కర మూకలు చేస్తున్న కల్లోలాలకు గట్టి సమాధానమే ఆపరేషన్‌ సిందూర్‌. ఇది సిందూర్ మాత్రమే కాదు.. సిన్‌-డోర్‌ కూడా. అంటే పాపాత్ములపై తెరుచుకున్న మృత్యుద్వారాలే ఈ సిన్‌-డోర్‌. పహల్గాంలో చనిపోయిన 26మంది ఆత్మలకు ఇప్పుడు శాంతి చేకూరుతుంది. తలలో కాల్చారు.. గుండెల్లో కాల్చారు, మోకాళ్లపై కూర్చోబెట్టి కాల్చారు.

POK అండ్‌ పాకిస్తాన్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఆ తొమ్మది కూడా ఉగ్ర క్యాంపులకు స్థావరాలుగా ఉన్నాయి. ఆ స్థావరాలు ఓసారి తెలుసుకుందాం. 1. తొలి స్ట్రైక్‌ మర్కజ్‌ సువానల్లా, బహవల్పూర్‌లో జరిగింది. 2. మర్కజ్‌ తయ్యబా, మురిద్కే 3. సర్జల్‌, టెహ్రాకలాన్‌ 4. మహమూనా జోయా సువిధా, సియాల్‌కోట్‌ 5. మర్కజ్‌ అహ్లే హదీస్‌ బర్నాలా, భింబర్‌. 6. మర్కజ్‌ అబ్బాస్‌, కోట్లీ. 7. మస్కర్‌ రహీల్‌ షాహిద్‌, కోట్లీ. 8. షావాయి నాలా క్యాంప్‌, ముజఫరాబాద్‌. 9. సయ్యద్నా బిలాల్‌ క్యాంప్‌, ముజఫరాబాద్‌.

ఈ తొమ్మది టార్గెట్స్‌ అన్నీ ముష్కర స్థావరాలే. ముష్కరుల రిక్రూట్‌మెంట్‌, ట్రైనింగ్‌, ఆపరేషనల్‌ స్కిల్స్‌ నేర్పిస్తున్న ఈ స్థావరాలు ఇప్పుడు ధ్వంసమయ్యాయి. దాదాపు వందమంది ముష్కరులను మట్టుబెట్టాయి మన సేనలు. ఆపరేషన్‌ సింధూర్‌పై పాకిస్తాన్‌ ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తోంది. తమ బిడ్డలు చనిపోయారంటూ కన్నీరు పెడుతోంది. నిజమే ఉగ్రవాదులే మీ బిడ్డలు. మీది ఓ ఉగ్రదేశం అంటూ సెటైర్లు పేలుతున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *