ట్రైన్‌లో అరుదైన దృశ్యం..! ఇది కదా నిజమైనా బంధం అంటే..!

divyaamedia@gmail.com
1 Min Read

ప్రేమకు వయసుతో సంబంధం లేదు. నిజానికి వయసులో ఉన్నప్పుడు ఆడ, మగ మధ్య పుట్టేది ఆకర్షణ మాత్రమే. వయసు మళ్లాకే ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ పుడుతుంది. 20, 30 ఏళ్లు కలిసి జీవించిన తర్వాతే భార్యాభర్తల మధ్య నిజమైన అనుబంధం, ఆప్యాయత మొదలవుతాయి.

అయితే కోయంబత్తూరు నుండి ప్రయాణిస్తున్న జిష్మా ఉన్నికృష్ణన్ అనే మహిళ ఈ అందమైన క్షణం వీడియోను రికార్డ్ చేసింది, దీనిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @jishma_unnikrishnan లో షేర్ చేసింది, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో రైలు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో పక్క సీట్లలో కూర్చున్న ఒక వృద్ధ జంటను చూడవచ్చు.

భర్త ప్రేమగా తన భార్య కాళ్లకు కొత్త పట్టీలను స్వయంగా ఆయనే తొడిగాడు. ఈ సమయంలో ఆ మహిళ ముఖంలో ఆనందంతో నిండిపోయింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉన్నికృష్ణన్ ఇలా రాశారు, నేను కూడా అదే రైలులో ప్రయాణిస్తున్నాను, కానీ ఒక సాధారణ క్షణంలో నేను జీవితకాల ప్రేమకు సాక్షిని అయ్యాను.

కొన్ని సెకన్ల ఈ వీడియో క్లిప్‌ను ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వీక్షించారు. 1 లక్ష 17 వేలకు పైగా ప్రజలు దీన్ని లైక్ చేశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *