ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు అంకితం చేసిన రోజు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ నిర్జల ఏకాదశి రోజు ప్రత్యేకంగా కొన్ని చెట్లకు నీరు సమర్పించాలి. ఇది అనుసరించకపోతే ఈ ఏకాదశి రోజు ఆచరించే ఉపవాస ఫలితం అసంపూర్ణం అంటారు పండితులు. అయితే నిర్జల ఏకాదశి శుక్రవారం రోజున వస్తుంది. అయితే ఇదే రోజున శక్తివంతమైన గ్రహాల్లో ఒక్కటైన బుధు గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయబోతుంది. దీంతో భద్ర రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం 12 రాశులపై పడగా, నాలు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసిరానున్నదంట.
కుంభ రాశి.. నిర్జల ఏకాదశి, బుధుడి సంచారంతో ఏర్పడే భద్ర రాజయోగం వలన కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. మొడి బాకీలు వసూలు అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. తుల రాశి.. భద్ర రాజయోగంతో తుల రాశి వారికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది.

అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయంటున్నారు పండితులు. సింహ రాశి.. ఏకాదశి రోజే బుధు గ్రహం సంచారం చేయడం వలన ఏర్పడే భద్ర రాజయోగంతో సింహ రాశి వారి విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారు విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి.
అంతే కాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, మంచి కాలేజీల్లో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. వృషభ రాశి.. వృషభ రాశి వారికి నిర్జల ఏకాదశి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో వీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.