శంషాబాద్లో “ది ఇండియన్ హౌజ్” సినిమా షూటింగ్ జరుగుతుండగా.. వాటర్ ట్యాంకర్ పేలిపోవడంతో ఒక్కసారిగా లోకేషన్ మొత్తం నీటితో నిండిపోయింది. పూర్తీ వివరాలోకి వెళ్తే యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ది ఇండియా హౌస్. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే బుధవారం ఈ మూవీ షూటింగ్ సెట్ లో పెను ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదం పై స్పందించారు నిఖిల్. తామంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారుర. “ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు కొన్నిసార్లు రిస్క్ చేయడం తప్పదు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది.
కానీ మా సిబ్బంది తీసుకున్న జాగ్రత్తల కారణంగా మేమంతా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు” అంటూ చెప్పుకొచ్చారు. నిఖిల్ నటిస్తున్న ఈ సినిమా కోసం శంషాబాద్ సమీపంలో వేసిన సెట్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా సెట్ లోకి నీళ్లు ముంచెత్తాయి.
దీంతో పలువురి సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అలాగే షూటింగ్ సామాగ్రి మొత్తం నీటిలో తడిచిపోయింది. ఈ చిత్రాన్ని 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో తెరకెక్కిస్తున్నారు.
We r all Safe 🙏🏽
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 12, 2025
Sometimes in our Quest to give the Best cinematic Experience we take Risks. Today we survived a Huge mishap thanks to the Alert Crew and Precautions taken.
We lost Expensive Equipment but by gods grace there was no human damage 🙏🏽 #IndiaHouse https://t.co/uhrHjOUtFx