నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అయ్యింది. ఈ 13 ఏళ్లల్లో మాగ్జిమమ్ అన్ని షోలు చేశాను. చాలా కామెడీ పాత్రల్లో నటించా.. టీవీ షోలు, వెబ్ సిరీస్ లు , సీరియల్స్ లోనూ నటించా.. కానీ సినిమాల్లో ఛాన్స్ మాత్రం అందుకోలేకపోయాను. సినిమాల్లో కనిపించకుండానే చనిపోతానని అనుకున్నా కానీ నాకల నెరవేరింది అని తెలిపారు. చిన్న చిన్న సినిమాల్లో నటించాను కానీ అవి అంతగా చెప్పుకోదగ్గవి కాదు. దాంతో ఓ చిన్న వెలితి ఉండిపోయింది. కానీ ఇప్పుడు సిద్దు హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్లో ఆయనకు మేనత్తగా చేశాను.
అయితే అయితే ఇటీవల ఆమె జబర్దస్త్ షో నుంచి బయటకు రావడానికి కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చమ్మక్ చంద్ర చేసిన కొన్ని వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని నీరజ తెలిపారు. తన భర్త సుబ్బు క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్న సమయంలో జబర్దస్త్ షూటింగ్కు వెళ్లలేకపోయారని, ఈ నేపథ్యంలో చమ్మక్ చంద్ర క్యాటరింగ్ వ్యాపారం ఉన్నప్పుడు కామెడీ షోలు ఎందుకు చేయాలి? అని ప్రశ్నించినట్లు ఆమె అన్నారు. ఇది తమకు అవమానకరంగా అనిపించిందని, ఒక ఆర్టిస్ట్ కు ఇతర వ్యాపారాలు ఉండకూడదా అని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర మనస్తాపం చెంది జబర్దస్త్ నుండి బయటకు వచ్చినట్లు నీరజ వివరించారు. జబర్దస్త్ లోని స్క్రిప్ట్ నాణ్యత కూడా తమను అసంతృప్తికి గురి చేసిందని నీరజ అన్నారు. స్కిట్లలో 70% ఆరోగ్యకరమైన హాస్యం ఉన్నా, 30% మాత్రం బూతుతో నిండి ఉంటుందని, కొన్ని సందర్భాల్లో పూర్తి బూతుకు దారి తీసిందని పేర్కొన్నారు. దీనివల్ల స్కిట్లు పండక, సుబ్బు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. జబర్దస్త్ టీం లీడర్గా ఉన్నప్పటికీ, తమకు తగిన గౌరవం లభించలేదని, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక ప్లాట్ఫారమ్ను వదిలివేయడం మంచిదని తాము నిర్ణయించుకున్నామని ఆమె వివరించారు.
మరో టీంలోకి వెళ్లమని అవకాశం ఇచ్చినా, టీం లీడర్గా వచ్చిన తాము వేరే టీంలో మింగిల్ అవ్వడం ఇష్టం లేక ఆ షో మానేసినట్లు తెలిపారు. అంతకుముందు, జబర్దస్త్ లోకి రాకముందు గెటప్ శ్రీను వద్ద సుబ్బు అవకాశం అడిగితే, ఆయన పట్టించుకోకుండా బ్లాక్ చేశారని నీరజ వెల్లడించారు. చాలా మంది తమను చిన్నచూపు చూశారని, పలకరించేవారు కూడా కాదని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఇన్ని అవమానాల మధ్య ఒక వేదికపై కొనసాగడం కంటే బయటకు రావడం మేలని నీరజ స్పష్టం చేశారు. ఈ ఘటనల తర్వాత చమ్మక్ చంద్ర ఎదురుపడినా తాను పలకరించలేదని, ఆయన కూడా మాట్లాడలేదని తెలిపారు.
